టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. సుస్మిత, సాయి లౌకిక్ ఇళ్లలో సిట్ తనిఖీలు

Siva Kodati |  
Published : Apr 15, 2023, 04:39 PM ISTUpdated : Apr 15, 2023, 04:45 PM IST
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. సుస్మిత, సాయి లౌకిక్ ఇళ్లలో సిట్ తనిఖీలు

సారాంశం

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులు సాయి లౌకిక్, సుస్మిత ఇళ్లలలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వీరిద్దరిని శుక్రవారం సిట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులు సాయి లౌకిక్, సుస్మిత ఇళ్లలలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డీఏవో పరీక్షలకు సంబంధించిన పేపర్ కోసం ప్రవీణ్‌కు వీరు రూ.6 లక్షలు చెల్లించినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. దీంతో సిట్ అధికారులు లౌకిక్, సుస్మితలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.  కేసు విచారణలో భాగంగా శనివారం ఖమ్మంలోని లౌకిక్ ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు చేశారు.

కాగా.. ఖమ్మం జిల్లాకు చెందిన సాయి లౌకిక్, సుష్మిత దంపతులను కొద్ది రోజుల క్రితం డిఏవో ప్రశ్నపత్రం కొనుగోలు కేసులో అరెస్టు చేశారు. వీరిద్దరిని శుక్రవారం సిట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొదట వీరిద్దరు చంచల్గూడా జైలులో ఉన్నారు. వారి నుంచి మరింత సమాచారం రాబట్టాలని న్యాయస్థానంలో వారి కస్టడీని కోరుతూ పిటిషన్ వేశారు. గురువారం ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన న్యాయస్థానం వారిని మూడు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. డీఏవో పరీక్షకు హాజరైన అభ్యర్థుల లిస్ట్ ను కూడా తయారు చేస్తున్నారు. లీకేజీ నిందితులతో వీరిలో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనే దిశగా ఆరా తీస్తున్నారు.

ఇదిలావుండగా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులిద్దరికీ ఆ పేపర్లున్న సిస్టమ్ పాస్ వర్డ్ ఎలా తెలిసిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకర లక్ష్మి పాస్వర్డ్, యూజర్ ఐడి ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డికి ఎలా తెలిసాయి అనేది మిస్టరీగా మారింది. టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం గత నెల 11వ తేదీన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు ఈ కేసులో 18 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ALso Read: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. ఈడీ ఎదుట హాజరైన శంకరలక్ష్మీ..

రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ గ్రూప్ వన్ ప్రిలిమినరీలో 100కు పైగా మార్కులు సాధించాడు. ప్రస్తుతం ప్రశాంత్ న్యూజిలాండ్ లో ఉన్నాడు.  ఇది గుర్తించిన సిట్ పోలీసులు అతనికి వాట్సప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. దీనికి ప్రశాంత్ స్పందిస్తూ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నాపత్రం తనకు అందలేదని వాట్సాప్ ద్వారానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులోనూ, సిట్ కస్టడీలోను నిందితులిద్దరూ యూజర్ ఐడి, పాస్వర్డ్ లను ప్రశ్నాపత్రాల కోసం కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ డైరీలో రాసినవే తీసుకున్నట్లుగా ఒకేలాగా చెప్పుకొచ్చారు.

వీరు చెప్పిన సమాచారం ప్రకారం కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకర లక్ష్మి డైరీని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, అందులో ఎక్కడా కూడా యూజర్ ఐడి, పాస్వర్డ్  రాసినట్లుగా ఆధారాలు లభించలేదు. శంకర లక్ష్మి కూడా ఈడీ అధికారుల విచారణలో, సిట్ పోలీసులకు ఇదే విషయాన్ని చెప్పారు.  మరోవైపు ప్రశ్నపత్రాల కొనుగోలు వ్యవహారంలో వీరితో పాటు మరికొందరు కూడా ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఆ అనుమానితుల జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం