మేడిగడ్డ బ్యారేజీ పిల్ల‌ర్లు కుంగిపోవడానికి కార‌ణం అదే.. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్ల కీల‌క ప్ర‌క‌ట‌న

Published : Nov 09, 2023, 02:42 AM IST
మేడిగడ్డ బ్యారేజీ పిల్ల‌ర్లు కుంగిపోవడానికి కార‌ణం అదే.. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్ల కీల‌క ప్ర‌క‌ట‌న

సారాంశం

Medigadda Barrage: సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు, సలహా మేరకు మేడిగ‌డ్డ‌ బ్యారేజీ పిల్లర్లను మరమ్మతులు చేసి మునుపటి స్థితికి తీసుకువస్తామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ ఇంజినీర్లు తెలిపారు.  

Telangana State Irrigation Department: తెలంగాణ ప్రభుత్వ ప్ర‌తిష్టాత్మ‌క కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ (లక్ష్మీ బ్యారేజీ)లోని పిల్ల‌ర్లు కుంగిపోవడంపై విచారణ జరుపుతున్న రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మీడియాతో మాట్లాడిన ఇంజినీర్లు.. నదీగర్భంలో వచ్చిన మార్పుల వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చనీ, మరే ఇతర అంశాలు ఇందుకు కారణమని చెప్పలేమని పేర్కొన్నారు. మొత్తానికి ఈ ఘ‌ట‌న దురదృష్టకరమనీ, రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇంజనీర్లు ఇలాంటి సంఘటనలు జరగాలని కోరుకోవడం లేదని తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీ పిల్ల‌ర్లు కుంగ‌డంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న త‌రుణంలో కేంద్రం ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ‌ ఎల్ అండ్ టీ కంపెనీ, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ వద్ద పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు, సలహా మేరకు బ్యారేజీ పిల్లర్లను మరమ్మతులు చేసి మునుపటి స్థితికి తీసుకువస్తామని వారు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన WAPCOS తయారు చేసిందనీ, దీనికి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహా మండలి (TAC) ఆమోదం తెలిపిందని తెలిపారు. ప్రాజెక్ట్ నివేదికను TAC ఆమోదించడానికి ముందు, హైడ్రాలజీ, నీటిపారుదల ప్రణాళిక, అంచనాలు, డిజైన్, అంతర్రాష్ట్ర ఒప్పందాలు అన్ని అంశాలు సరైనవని నిర్ధారించడం ద్వారా కేంద్ర జల సంఘం దానిని ఆమోదించింద‌న్నారు.

2022 గోదావరి వరదల సమయంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లోని కన్నెపల్లి , అన్నారం పంప్ హౌస్‌లు కూడా నీట మునిగాయి. 3 నెలల్లోనే వాటిని పునరుద్ధరించి, పంటలకు నీటి సరఫరా షెడ్యూల్‌లో అంతరాయం లేకుండా కొనసాగింది. ఇప్పుడు ల‌క్ష్మీ బ్యారేజీలో స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పైప్‌లైన్లు పగిలిన సమయంలో కూడా దేవాదుల ప్రాజెక్టులో సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర ఇంజనీర్లు సమస్యలపై హాజరుకావడం ద్వారా ప్రాజెక్టును సంపూర్ణంగా పునరుద్ధరించవచ్చు. పిల్ల‌ర్ల‌లో సమస్యలు ఉన్నప్పటికీ, బ్యారేజీకి సంబంధించిన ప్రభావవంతమైన స్ట్రెచ్‌ను కవర్ చేస్తూ కాఫర్ డ్యాం నిర్మిస్తున్నామనీ, మేడిగడ్డ నుండి నీటి పంపింగ్‌ను త్వరలో పునరుద్ధరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు యాసంగి ఆయకట్టు మొత్తానికి నీరు అందిస్తామన్నారు. 

కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేష‌న్ స్కీమ్ రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి..

కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేష‌న్ స్కీమ్ లోని రిజర్వాయర్లన్నీ నిండిపోయాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. శ్రీరాంసాగర్‌లో 87 టీఎంసీలు , సరస్వతి బ్యారేజీలో 5.94 టీఎంసీలు , ఎల్లంపల్లిలో 20 టీఎంసీలు , మిడ్ మానేరులో 23 టీఎంసీలు , దిగువ మానేరులో 20 టీఎంసీలు , 2.17 టీఎంసీలు అందుబాటులో ఉంచుతూ కేఎల్‌ఐఎస్‌లో భాగమైన అన్ని రిజర్వాయర్లను ప్రభుత్వం ముందుగానే నింపింది. అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌లో 1.66 టీఎంసీలు , మల్లన్న సాగర్‌లో 15 టీఎంసీలు , కొండపోచమ్మ సాగర్‌లో 15 టీఎంసీల నీరు ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్