ఖమ్మం జిల్లాలో కీచక హెడ్‌మాస్టర్.. విద్యార్థినీలతో అసభ్య ప్రవర్తన, వెకిలి చేష్టలు..

By Sumanth KanukulaFirst Published Aug 22, 2022, 12:26 PM IST
Highlights

విద్యాబుద్దులు నేర్పి, విద్యార్థులు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడి బుద్ది వక్రమార్గం పట్టింది. చదవు చెప్పాల్సిన వ్యక్తి విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆందోళన చెందిన విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పారు.

విద్యాబుద్దులు నేర్పి, విద్యార్థులు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడి బుద్ది వక్రమార్గం పట్టింది. చదవు చెప్పాల్సిన వ్యక్తి విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆందోళన చెందిన విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా‌లో చోటుచేసుకుంది. వివరాలు.. వైరా మండలంలోని కేజీ సిరిపురం గ్రామంలోని స్కూల్‌లో రామారావు హెడ్‌మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు గాంధీ చిత్రం చూపించేందుకు తీసుకెళ్లారు. 

అయితే థియేటర్‌లో కొందరు విద్యార్థినిలతో హెడ్ మాస్టర్ రామారాము అసభ్యంగా ప్రవర్తించాడు. వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. అయితే ఇంటికి చేరిన తర్వాత విద్యార్థినీలు ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడు రామారావును నిలదీశారు. రామారావుపై దాడికి దిగారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గ్రామస్థుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నట్టుగా తెలిపారు. రామారావు తప్పు ఉందని తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక, రామారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. 
 

click me!