కరోనా ఎఫెక్ట్.. కన్నతల్లిని ఊర్లోకి రానివ్వకుండా..

Published : Apr 14, 2020, 11:11 AM IST
కరోనా ఎఫెక్ట్.. కన్నతల్లిని ఊర్లోకి రానివ్వకుండా..

సారాంశం

 ఓ గ్రామ సర్పంచి ఏకంగా తన కన్న తల్లిని కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వలేదు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం గోసాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.  

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి 600కి దగ్గరలో కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ప్రకటించగా.. కేంద్రం ఏకంగా మార్చి 3వ తేదీ వరకు పొడిగించింది.

కాగా.. గ్రామాల్లో సైతం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గ్రామస్థులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. పక్కగ్రామాల నుంచి వచ్చే వారిని కూడా అనుమతించడం లేదు. ఓ గ్రామ సర్పంచి ఏకంగా తన కన్న తల్లిని కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వలేదు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం గోసాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

గోసాయి పల్లి గ్రామంలో లాక్‌డౌన్‌ పకడ్బందిగా అమలు చేస్తున్నారు. గోసాయిపల్లి సర్పంచ్‌ సాయగౌడ్‌ తన తల్లి తులశమ్మ సోమవారం గ్రామానికి వచ్చింది. ఊర్లోకి రానివ్వకుండా పొలిమేరల్లో అడ్డుకుని వెనుకకు పంపించారు. ఇటీవలే తులశమ్మ సిర్గాపూర్‌లోని బంధువుల వద్దకు వెళ్లింది. 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరగడంతో గ్రామంలో ఎవరూ రాకుండా.. బయటకు వెళ్లకుండా ఉండేందుకు రోడ్డును మూసివేశారు. సొంత గ్రామానికి తులశమ్మ రావడంతో అందరికీ ఒకే విధంగా నిబంధనలు వర్తిసాయని సర్పంచ్‌ స్పష్టం చేశారు. ఊరుబయట నుంచే అమెను తిరిగి సిర్గాపూర్‌లోని బంధువుల వద్దకు పంపించారు.

PREV
click me!

Recommended Stories

Telangana: బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు.. అస‌లు కార‌ణం అదేనా.? కాంగ్రెస్ వాద‌న ఏంటంటే
Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu