సంగారెడ్డిలో అత్యాచార బాధితురాలి కుటుంబం నుండి లంచం డిమాండ్: అధికారి సస్పెన్షన్

Published : Jan 16, 2023, 09:29 PM IST
సంగారెడ్డిలో అత్యాచార బాధితురాలి కుటుంబం నుండి  లంచం డిమాండ్: అధికారి సస్పెన్షన్

సారాంశం

సంగారెడ్డి జిల్లాలోని అత్యాచార బాధితురాలి  కుటుంబానికి  పరిహరం చెల్లింపులో  లంచం డిమాండ్  చేసిన  అధికారి సత్యనారాయణను జిల్లా కలెక్టర్  శరత్ సస్పెండ్  చేశారు.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో  రూ. 50 వేలు లంచం అడిగిన  అధికారిని  కలెక్టర్ శరత్  సస్పెండ్  చేశారు. జిల్లాలో అత్యాచార బాధితురాలి  కుటుంబానికి  రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల సహాయాన్ని ప్రకటించింది.  ఈ మేరకు  ప్రభుత్వం  చెక్ ను  కూడా  సిద్దం చేసింది. ఈ చెక్ ను  ఇచ్చేందుకు  కలెక్టరేట్ లో పనిచేసే అధికారి  సత్యనారాయణ  బాధితురాలి కుటుంబాన్ని  రూ. 50 వేలు లంచం అడిగాడు.  ఈ డబ్బులు  ఇవ్వకపోవడంతో  రూ.  5 లక్షల చెక్  ఇవ్వకుండా  తిప్పించుకున్నాడు.  ఐదు మాసాలుగా  అధికారి చుట్టూ తిరిగి విసిగిన బాధిత కుటుంబం   కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా  అధికారి సత్యనారాయణను  సస్పెండ్  చేశారు కలెక్టర్ శరత్,. మరో వైపు  బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్ ను వెంటనే అందించాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు.

అత్యాచార బాధితురాలిని ఆదుకోనేందుకు   అందిస్తున్న సహయంలో  కూడా లంచం ఆశించిన  అధికారి తీరుపై  మహిళా సంఘాలు  తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇలాంటి అధికారులు భవిష్యత్తులో మళ్లీ మళ్లీ ఈ తరహ చర్యలకు పాల్పడకుండా  చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  ఃఅత్యాచార ఘటనతో  మానసికంగా  తీవ్ర వేదనలో  ఉన్న కుటుంబానికి  ఆర్ధిక సహాయం అందించకుండా  ఐదు మాసాలు తిప్పిన  అధికారి తీరును  ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.    
 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu