
సిద్దిపేట: సిద్దిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద సోమవారం నాడు కాల్పులు జరిపి రూ. 43 .50 లక్షలను దుండగులు దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Telangana రాష్ట్రంలో రేపటి నుండి Registration చార్జీలు పెరగనున్నాయి. దీంతో ఇవాళే భారీగా రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చేరుకొన్నారు. ఇవాళ మధ్యాహ్నం Siddipeta రిజిస్ట్రేషన్ కార్యాలయానికి నర్సయ్య అనే వ్యక్తి కారులో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకొన్నారు. భూ లావాదేవీలకు సంబంధించి రూ. 43.50 లక్షలను కారులో ఆయన తీసుకొచ్చారు.
Carలోనే ఎర్ర బ్యాగులో నగదును ఉంచారు. కారులోనే డ్రైవర్ పరశురామ్ ఉన్నాడు. కారు అద్దాలు బిగించుకొని డ్రైవర్ కారులోనే ఉన్నారు. రియల్టర్ నర్సయ్య మాత్రం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో బాగంగా సంతకాలు చేసేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాడు.
ఈ సమయంలోనే bike పైన వచ్చిన దుండగులు మాస్కులు ధరించి కారు driver పై కాల్పులకు దిగి రూ. 43.50 లక్షలను దోచుకెళ్లారు.భూ విక్రయానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంతకాలు చేసేందుకు రియల్టర్ Narsaiah రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అదే సమయంలో ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చారు. నర్సయ్య కారు అద్దాలు పగులగొట్టారు. కారులో ఉన్న నగదు బ్యాగును తీసుకొన్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కారు డ్రైవర్ పరుశురామ్ కారును ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశారు. దీంతో దుండగులు డ్రైవర్ కాలుపై firing కి దిగారు. దీంతో పరుశురామ్ గాయపడ్డారు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న స్థానికులు చూసి నిందితులను పట్టుకొనే ప్రయత్నం చేశారు. అయితే తమ వద్ద ఉన్న pistol ని చూపి నిందితులు పారిపోయారు.
ఈ సమాచారం అందుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. నర్సయ్య కొనుగోలు చేసే భూ విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ భూమి ఏమైనా వివాదంలో ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులు నర్సయ్యను ఇంటినుండి ఫాలో అయ్యారా లేదా రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్దే కాపు కాశారా అనే విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.