శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి, శకలాల కింద మరో ఆరుగురు

Siva Kodati |  
Published : Apr 18, 2021, 07:49 PM IST
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి, శకలాల కింద మరో ఆరుగురు

సారాంశం

శంషాబాద్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. 15 మందికిపైగా గాయపడ్డారు. 

శంషాబాద్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. 15 మందికిపైగా గాయపడ్డారు.

శంషాబాద్‌ మార్కెట్‌ నుంచి వ్యాపారులు కూరగాయలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో లారీలో సుమారు 30 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు వ్యాపారులు లారీ కింద చిక్కుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu
RED Alert: ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్| Asianet News Telugu