శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి, శకలాల కింద మరో ఆరుగురు

Siva Kodati |  
Published : Apr 18, 2021, 07:49 PM IST
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి, శకలాల కింద మరో ఆరుగురు

సారాంశం

శంషాబాద్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. 15 మందికిపైగా గాయపడ్డారు. 

శంషాబాద్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. 15 మందికిపైగా గాయపడ్డారు.

శంషాబాద్‌ మార్కెట్‌ నుంచి వ్యాపారులు కూరగాయలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో లారీలో సుమారు 30 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు వ్యాపారులు లారీ కింద చిక్కుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.