సికింద్రాబాద్‌ : ప్యాట్నీ సెంటర్ వద్ద రోడ్డు డీసీఎంలు ఢీ, మద్యం మత్తులో డ్రైవర్ ..క్యాబిన్లో నుంచి బయటకు రాలేక

Siva Kodati |  
Published : Jun 01, 2023, 05:37 PM IST
సికింద్రాబాద్‌ : ప్యాట్నీ సెంటర్ వద్ద రోడ్డు డీసీఎంలు ఢీ, మద్యం మత్తులో డ్రైవర్ ..క్యాబిన్లో నుంచి బయటకు రాలేక

సారాంశం

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ సిగ్నల్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు క్యాబిన్‌లో చిక్కుకుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ సిగ్నల్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు డీసీఎం వ్యాన్‌లు ఢీకొట్టుకున్నాయి. అయితే ఓ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అయితే ఓ మనిషి విలవిలలాడిపోతుంటే జనం మాత్రం ఫోటోలు తీస్తూ చోద్యం చోద్యం చూశారు. డీసీఎం డ్రైవర్ మద్యం సేవించి వున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇతనిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ప్రమాదం కారణంగా ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu