జయశంకర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Published : May 31, 2018, 10:38 AM ISTUpdated : May 31, 2018, 11:05 AM IST
జయశంకర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

సారాంశం

కారు-బైక్ ఢీకొనడంతో ప్రమాదం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ములుగు మండలం జాకారం సమీపంలో కారు-బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శాయంపేట  మండలం గంగిరేణిగూడెం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇవాళ తెల్లవారుజామున బైక్ పై వెళుతున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ములుగు మండలం జాకారం సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్ పై వున్నవారు ఎగిరి రోడ్డు పక్కన పడ్డారు. ఈ ప్రమాదంలో బైక్ పై వున్న తండ్రీ, కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలతో తల్లి మాళవిక, కూతురు అనూష ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

 ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్