పీకలదాక తాగి డ్రైవింగ్... బంజారాహిల్స్ లో బెంజ్ కారు బీభత్సం

Arun Kumar P   | Asianet News
Published : Nov 22, 2020, 07:58 AM ISTUpdated : Nov 22, 2020, 08:13 AM IST
పీకలదాక తాగి డ్రైవింగ్... బంజారాహిల్స్ లో బెంజ్ కారు బీభత్సం

సారాంశం

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద ఓ బెంజ్ కార్ బీభత్సం సృష్టించింది.   

హైదరాబాద్: పార్టీ కల్చర్ పేరిట అర్దరాత్రుల వరకు మద్యం సేవించి రోడ్డుపైకి వస్తున్న కొందరు యువకులు నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇలా ఇటీవలే ఏపీకి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి తనయుడికి ఓబుల్ రెడ్డికి సంబంధించిన కారుతో ఓ యువకుడు యాక్సిడెంట్ చేసి భార్యాభర్తలను బలితీసుకున్నాడు. ఈ ఘటన మరువకముందే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద ఓ బెంజ్ కార్ బీభత్సం సృష్టించింది. 

నగరంలోని ఓ పబ్ లో పీకలదాక తాగిన ఇద్దరు యువకులు, ఓ యువతి కారుతో రోడ్డెక్కారు. ఈ మత్తులోనే డ్రైవింగ్ చేసిన యువకుడు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి మితిమీరిన వేగంతో బంజారాహిల్స్ వైపు వెళుతూ ఓ క్యాబ్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో క్యాబ్ లో వున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే క్యాబ్ తో పాటు ప్రమాదానికి కారణమైన బెంజ్ కారు ధ్వంసమయ్యాయి. 

read more  హైద్రాబాద్‌ హైటెక్‌సిటీ రోడ్డు ప్రమాదం: టెక్కీ కాశీ విశ్వనాథ్ అరెస్ట్

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమైన యువకుడితో పాటు మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!