స్పీకర్ కు రేవంత్ రెడ్డి లేఖ

Published : Nov 17, 2016, 01:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
స్పీకర్ కు రేవంత్ రెడ్డి లేఖ

సారాంశం

అనర్హత పిటిషన్ పై చర్య తీసుకోవాలని వినతి

తెదేపా నుంచి తెరాసలో చేరిన 12 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై డిసెంబరు 20లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ మధుసూదనాచారిని తెలుగుదేశం శాసనసభాపక్షనేత రేవంత్‌రెడ్డి కోరారు.

 

తాము ఇచ్చిన పిటిషన్‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తు చేస్తూ స్పీకర్‌కు లేఖ రాశారు. హైకోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని, అయినా సమాధానం లేదని ఆక్షేపించారు.

 

గడువులోగా నిర్ణయం తీసుకోకపోతే తాము మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
మార‌నున్న హైద‌రాబాద్ ముఖ‌చిత్రం.. రూ. 4వేల కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు, క‌ళ్లు చెదిరే మార్పులు