విషాదం: కరోనా భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Oct 02, 2020, 08:20 PM ISTUpdated : Oct 02, 2020, 11:17 PM IST
విషాదం: కరోనా భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య

సారాంశం

కరోనా వైరస్ సోకడం కంటే అది తమకు అంటిందన్న భయంతో చనిపోయే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. తాజాగా కోవిడ్ సోకిందన్న భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్యకు పాల్పడ్డారు

కరోనా వైరస్ సోకడం కంటే అది తమకు అంటిందన్న భయంతో చనిపోయే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. తాజాగా కోవిడ్ సోకిందన్న భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మియాపూర్ న్యూ సైబర్ హిల్స్‌లో ఉంటున్న రిటైర్డ్ న్యాయమూర్తి రామచంద్రారెడ్డి శుక్రవారం తన బెడ్‌రూమ్ సిలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

తన వల్ల కుటుంబసభ్యులకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆయన సూసైడ్ నోట్ రాశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్