పంట భూమి కబ్జా: జనగామలో రైతుల ఆందోళన

Siva Kodati |  
Published : Oct 02, 2020, 05:12 PM IST
పంట భూమి కబ్జా: జనగామలో రైతుల ఆందోళన

సారాంశం

జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. చేతికొచ్చిన కంది పంటను తొలిగించి తమ భూమిని కబ్జా చేశారని రైతులు ఆందోళనకు దిగారు. 

జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. చేతికొచ్చిన కంది పంటను తొలిగించి తమ భూమిని కబ్జా చేశారని రైతులు ఆందోళనకు దిగారు. లింగాల ఘన్‌పూర్ మండలం నెళ్లుట్ల గ్రామానికి చెందిన రైతులు పురుగు మందుల డబ్బాలతో ధర్నాకు దిగారు.

తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ముందు నినాదాలు చేశారు రైతులు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు .. పురుగు మందుల డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

PREV
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం