పుట్ట మధు నుండి నాకు ప్రాణహాని: రమణారెడ్డి

Published : Oct 08, 2018, 05:15 PM IST
పుట్ట మధు నుండి  నాకు ప్రాణహాని: రమణారెడ్డి

సారాంశం

కరీంనగర్ జిల్లా మంథని ఎమ్మెల్యే  పుట్ట మధు నుండి తనకు ప్రాణహాని ఉందని   బిల్ల రమణారెడ్డి  అనే యువకుడు సోమవారం నాడు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు


హైదరాబాద్: కరీంనగర్ జిల్లా మంథని ఎమ్మెల్యే  పుట్ట మధు నుండి తనకు ప్రాణహాని ఉందని   బిల్ల రమణారెడ్డి  అనే యువకుడు సోమవారం నాడు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు.  ఈ విషయమై  ఎమ్మెల్యే పాత్రపై  విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీ స్థానిక పోలీసులను ఆదేశించారు.

 తెలంగాణ సాధన కోసం ఆత్మహత్య చేసుకొన్న అమరుడు గుండా నాగరాజు ఆత్మహత్య కేసులో  తనను సాక్ష్యం చెప్పకూడదంటూ  మంథని ఎమ్మెల్యే తనను బెదిరిస్తున్నాడని  రమణారెడ్డి  ఈ మేరకు  డీజీపీకి ఫిర్యాదు చేశాడు.

 

ఎమ్మెల్యే మధు నుండి తనకు ప్రాణ హని ఉందంటూ ఆయన డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ కేసులో తనను సాక్ష్యం చెప్పొద్దని వేధిస్తున్నాడని  బాధితుడు ఆరోపించారు. అయితే  ఈ విషయమై  ఎమ్మెల్యే పాత్ర ఏ మేరకు ఉందో  వాస్తవాలు తెలుసుకొని  చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి  స్థానిక పోలీసులను ఆదేశించారు.  

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌