ప్రగతి భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు: కేసీఆర్‌కు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు

Siva Kodati |  
Published : Aug 22, 2021, 04:14 PM IST
ప్రగతి భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు: కేసీఆర్‌కు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు

సారాంశం

రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సోదరీ మణులు రాఖీ కట్టారు. అలాగే మంత్రి కేటీఆర్‌కు కూడా పలువురు టీఆర్ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టారు.  

దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పర్వదినాన్ని అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తమకు సోదరుడి వరుసయ్యే వారికి రాఖీని కట్టి వారి ఆశీస్సులు తీసుకున్నారు. పలువురు ప్రముఖులు సైతం రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసంలోనూ రాఖీ పండుగ సందడి కనిపించింది. కేసీఆర్ కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టి ఆశీస్సులు అందుకున్నారు. మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షు కూడా రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అక్కడే ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్