యాదాద్రిలో వ్యభిచార గృహాలపై దాడులు.. 400 మంది యువతులకు విముక్తి: సీపీ మహేశ్ భగవత్

By Siva KodatiFirst Published Jul 30, 2021, 6:34 PM IST
Highlights

పదేళ్ల కాలంలోనే యాదాద్రిలో వ్యభిచార ముఠాలను కట్టడి చేశామని అన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. వ్యభిచార గృహాలను నడిపించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. 94 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు
 

యాదాద్రిలో వ్యభిచార ముఠాలు లేకుండా చేశామన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. 34 మంది పిల్లలు, 34 మంది యువతులను రక్షించినట్లు ఆయన తెలిపారు. పదేళ్ల కాలంలోనే యాదాద్రిలో వ్యభిచార ముఠాలను కట్టడి చేశామని సీపీ అన్నారు. వ్యభిచార గృహాలను నడిపించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు మహేశ్ భగవత్. 94 మందిపై పీడీ  యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 400 మంది యువతులను రక్షించినట్లు సీపీ తెలిపారు. 

click me!