హుజురాబాద్ ఉప ఎన్నిక: అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్.. పాదయాత్రకు బ్రేక్, నిమ్స్‌కు తరలింపు

Siva Kodati |  
Published : Jul 30, 2021, 06:01 PM ISTUpdated : Jul 30, 2021, 06:02 PM IST
హుజురాబాద్ ఉప ఎన్నిక: అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్.. పాదయాత్రకు బ్రేక్, నిమ్స్‌కు తరలింపు

సారాంశం

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పాదయాత్రలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. 

హుజురాబాద్‌లో ప్రజా దీవెన యాత్ర నిర్వహిస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పాదయాత్రలో అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి పాదయాత్ర చేరుకుంది. ఈ నేపథ్యంలో లంచ్ తర్వాత అస్వస్థతకు గురయ్యారు ఈటల రాజేందర్. దీంతో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కాళ్లకు పొక్కులు రావడం , స్వల్పంగా దగ్గు, జలుబు కావడంతో రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆయనను మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే