కోడి గుడ్లు పెడుతుందని చూడడానికి వెళ్లి.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. కానిస్టేబుల్ నిర్వాకం...

By AN TeluguFirst Published Dec 2, 2021, 1:52 PM IST
Highlights

కానిస్టెబుల్ ఇంట్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మేస్త్రీ కుటుంబం ఆరేళ్లుగా అద్దెకు ఉంటోంది. వీళ్లకు 14 యేళ్ల అమ్మాయి ఉంది. బుధవారం ఉదయం 7,8 గంటల మధ్యలో బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడ్డాడు. బాలిక మీద అత్యాచారయత్నం చేశాడు. 

హైదరాబాద్ లో ఓ Constable దారుణానికి తెగబడ్డాడు. ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి మైనర్ బాలిక మీద లైంగిక దాడికి ప్రయత్నించాడు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయ్యప్పరెడ్డిగూడ కాలనీకి చెందిన శేఖర్ కూకట్ పల్లిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 

అతని ఇంట్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ Maistry family ఆరేళ్లుగా అద్దెకు ఉంటోంది. వీళ్లకు 14 యేళ్ల అమ్మాయి ఉంది. బుధవారం ఉదయం 7,8 గంటల మధ్యలో బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడ్డాడు. బాలిక మీద rape attempt చేశాడు. 

తల్లిదండ్రులు తిరిగి ఇంటికి చేరుకునే సరికి అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఏమైందని parents నిలదీయడంతో.. భయంభయంగా కానిస్టేబుల్ చేసిన పని చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు పోలీస్ కానిస్టేబుల్ శేఖర్ ను చితకబాదారు. ఆ తరువాత 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. నిందితుడు శేఖర్ మీద శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ లో పోక్సో, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. 

తదుపరి విచారణ నిమిత్తం చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. బాలిక ఇంట్లో.. కోడి గుడ్లు పెడుతుందని చూసేందుకు వెళ్లానని శేఖర్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. 

విషాదం : తొమ్మిదినెలల చిన్నారిని నడుముకు కట్టుకుని బావిలో దూకిన తల్లి... !!

కాగా, రాజస్థాన్ లో ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని మీద సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో పోలీసులు బుధవారం ఒకరిని arrest చేశారు. మంగళవారం సాయంత్రం తనపై gang rape జరిగిందని ఆరోపిస్తూ 20 ఏళ్ల MBBS student పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అల్వార్ పోలీసులు బుధవారం 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు రవి చౌదరి అని పోలీసులు గుర్తించారు. రెండో నిందితుడు రవీంద్ర చౌదరి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ కేసులో బాలిక బ్యాచ్‌మేట్ ప్రమేయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అల్వార్‌లో జరుగుతున్న తన చెల్లి marriageకి రావాల్సిందిగా ఆ యువతి బ్యాచ్ మేట్ ఆమెను ఆహ్వానించాడు. ఆ క్రమంలోనే ఈ దారుణం చోటు చేసుకుందని అల్వార్ పోలీసులు పేర్కొన్నారు. అతని ఆహ్వానం మేరకు ఆమె వస్తానని చెప్పింది. ఆమెను పెళ్లికి తీసుకురమ్మని తన స్నేహితులైన రవి, రవీంద్రలను కారులో ఆ బ్యాచ్ మేట్ పంపించాడు. 

ఈ మేరకు యువతిని పికప్ చేసుకున్న స్నేహితులిద్దరూ ఆమెను ఫంక్షన్ హాల్ కు తీసుకు వెళ్లకుండా నేరుగా ఓ హోటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ రవీంద్ర గది బయట కాపలాగా ఉండగా రవి యువతిపై హోటల్‌ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో షాక్ కు గురైన యువతి సహాయం కోసం అర్థించింది. హోటల్ గదినుంచి తప్పించుకుని మంగళవారం సాయంత్రం సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. 

click me!