పీఎస్‌పై దాడి.. హైదరాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్సీపై కేసు నమోదు..!

Published : Jun 22, 2023, 04:54 PM IST
పీఎస్‌పై దాడి.. హైదరాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్సీపై కేసు నమోదు..!

సారాంశం

హైదరాబాద్ లాలాగూడ  పోలీసు స్టేషన్‌లో ఎంఐఎం ఎమ్మెల్సీ దౌర్జన్యానికి  దిగారు. ఈ క్రమంలోనే ఆయనపై పోలీసులు కేసు నమోదు  చేశారు. 

హైదరాబాద్ లాలాగూడ  పోలీసు స్టేషన్‌లో ఎంఐఎం ఎమ్మెల్సీ దౌర్జన్యానికి  దిగారు. అక్రమంగా  జంతువులను తరలిస్తున్న ఎంఐఎం కార్యకర్తలు ఈ క్రమంలో ఎంఐఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. 30 మంది ఎంఐఎం కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ లాలాగూడ పోలీసు స్టేషన్‌కు చేరుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారు. పీఎస్‌లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్‌పై దాడి చేసి ఎంఐఎం కార్యకర్తలను తీసుకెళ్లిపోయారు. 

ఈ క్రమంలోనే పోలీసు  కార్యాలయంపై దాడికి యత్నించారని ఎంఐఎం  ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్‌ పోలీసులు పలు  సెక్షన్ల కింద కేసు నమోదు  చేశారు.  ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానల్ రిపోర్టు చేసింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bullet Train లో హైదరాబాద్ నుండి అమరావతి, బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై కి... ఎంతసేపట్లో చేరుకోవచ్చో తెలుసా..?
Kalvakuntla Kavitha: రేవంత్ రెడ్డికి, కేసిఆర్ కి ఒకేసారి ఇచ్చిపడేసిన కవిత | Asianet News Telugu