పీఎస్‌పై దాడి.. హైదరాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్సీపై కేసు నమోదు..!

Published : Jun 22, 2023, 04:54 PM IST
పీఎస్‌పై దాడి.. హైదరాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్సీపై కేసు నమోదు..!

సారాంశం

హైదరాబాద్ లాలాగూడ  పోలీసు స్టేషన్‌లో ఎంఐఎం ఎమ్మెల్సీ దౌర్జన్యానికి  దిగారు. ఈ క్రమంలోనే ఆయనపై పోలీసులు కేసు నమోదు  చేశారు. 

హైదరాబాద్ లాలాగూడ  పోలీసు స్టేషన్‌లో ఎంఐఎం ఎమ్మెల్సీ దౌర్జన్యానికి  దిగారు. అక్రమంగా  జంతువులను తరలిస్తున్న ఎంఐఎం కార్యకర్తలు ఈ క్రమంలో ఎంఐఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. 30 మంది ఎంఐఎం కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ లాలాగూడ పోలీసు స్టేషన్‌కు చేరుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారు. పీఎస్‌లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్‌పై దాడి చేసి ఎంఐఎం కార్యకర్తలను తీసుకెళ్లిపోయారు. 

ఈ క్రమంలోనే పోలీసు  కార్యాలయంపై దాడికి యత్నించారని ఎంఐఎం  ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్‌ పోలీసులు పలు  సెక్షన్ల కింద కేసు నమోదు  చేశారు.  ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానల్ రిపోర్టు చేసింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: రుతుపవనాల జోరు.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హైఅలర్ట్
హైద‌రాబాద్‌కి 50 కి.మీల దూరంలో రూ. 500 కోట్ల‌తో ప్ర‌పంచ టూరిస్ట్ సెంట‌ర్‌.. ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది