తెలంగాణ ప్రభుత్వం తొలిసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీపై వివాదాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 2 వ్యవహారం కోర్టులో పెండింగ్ లో ఉంది. తాజాగా గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా మరో నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ చేపట్టాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.
గ్రూప్ 2 అభ్యర్థుల తరుపున న్యాయవాది రచనా రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోర్టుకు నివేదించారు రచనారెడ్డి. గతంలో టిఎస్సిఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష లో OMR షీట్ లో కోడింగ్,ఢీ కోడింగ్ విధానం లేదని దీనివల్ల అనేక అక్రమాలు జరిగాయన్నారు పిటిషనర్.
బబ్లింగ్,రీ బబ్లింగ్ ఎంతమంది చేశారు అనేది కూడా తెలియదని, అందులో సెక్యురిటి ఫీచర్స్ ఏ మాత్రం లేవని హైకోర్టు తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది రచన రెడ్డి. దీనిపై ఈరోజు విచారించిన హైకోర్టు మూడు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలంటూ టిఎస్సిఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.