కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో ట్విస్ట్: షాకిచ్చిన మహిళ

By narsimha lodeFirst Published Aug 31, 2021, 1:39 PM IST
Highlights


కామారెడ్డి జిల్లా కేంద్రంలో వివాహిత గొంతు కోసిన ఘటనలో  పోలీసులు వాస్తవాన్ని తేల్చారు.వివాహిత తానే గొంతు కోసుకొందని పోలీసులు గుర్తించారు. ప్రేమ వ్యవహరమే పోలీసులు గుర్తించారు.

కామారెడ్డి:కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బర్కత్‌పురలో వివాహిత గొంతు కోసిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకొంది. వివాహిత నిషా తానే గొంతు కోసుకొని తనపై హత్యాయత్నం జరిగిందని  నమ్మించే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు తేల్చారు.నిషాకు  తొమ్మిది నెలల క్రితం కామారెడ్డికి  చెందిన యువకుడితో పెళ్లి జరిగింది.

also read:కామారెడ్డి జిల్లాలో దారుణం: మహిళ గొంతుకోసిన దుండగులు, పరిస్థితి విషమం

గతంలో ప్రేమ వ్యవహరమే  వివాహిత ఆత్మహత్యాయత్నానికి కారణమని భావిస్తున్నారు. రెండు నెలల క్రితం కూడ ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. యువతి  ఆరోగ్య పరిస్థితి మెరుగా ఉందని పోలీసులు చెప్పారు.ఇవాళ ఉదయమే ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయంలో బైక్ పై  ముసుగులు ధరించిన ఇద్దరు వచ్చి తన గొంతు కోశారని బాధితురాలు కుటుంబసభ్యులను నమ్మించింది. అయితే పోలీసుల విచారణలో అసవలు విషయం తేలింది.
 

click me!