హాజీపూర్ సీరియల్ రేపిస్ట్ కేసు: ఈ నెల 27 తుది తీర్పు

Published : Jan 17, 2020, 02:17 PM ISTUpdated : Feb 06, 2020, 11:30 AM IST
హాజీపూర్ సీరియల్ రేపిస్ట్ కేసు: ఈ నెల 27 తుది తీర్పు

సారాంశం

హాజీపూర్ సీరియల్ హత్యల కేసులో ఈ నెల 27వ తేదీన తుది తీర్పు వెలువర్చనుంది నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.


ఈ నెల 27వ తేదీన హాజీపూర్‌లో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య కేసులో నల్గొండ పాస్ట్‌ట్రాక్ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.

Also read:హాజీపూర్ కేసు: ఉరిశిక్ష విధించాలి, ముగిసిన ప్రాసిక్యూషన్ వాదనలు

ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య కేసులో సుమారు గంటపాటు శుక్రవారంనాడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.ఈ కేసు తుది తీర్పును 27న ఇవ్వనున్నట్టు పాస్ట్‌ట్రాక్ కోర్టు తేల్చి చెప్పింది.

Also Read:జాలి, దయ అక్కర్లేదు...హాజీపూర్ శ్రీనివాస్‌‌‌కి ఉరే సరి

15 రోజులుగా హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ చేస్తోంది.  రెండు కేసుల్లో శ్రీనివాస్ రెడ్డి తన వాదనలను విన్పించారు.

Also Read:నాపై తప్పుడు కేసు పెట్టారు: హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి

తాను అమాయకుడిని అంటూ శ్రీనివాస్ రెడ్డి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ముందు వివరించారు. అయితే శ్రీనివాస్ రెడ్డి వాదనను ప్రభుత్వ తరపు లాయర్ ఖండించారు. ఈ కేసులో పోలీసులు సేకరించిన శాస్త్రీయ ఆధారాలను కూడ ఇప్పటికే కోర్టుకు సమర్పించారు.

అయితే శ్రీనివాస్ రెడ్డిని తమకు అప్పగించాలని  మృతుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి విషయంలో ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు ఏ రకమైన తీర్పును వెల్లడించనుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu