ఆంధ్రా యువకుడిపై కేటీఆర్ ప్రశంసలు...రీట్వీట్ కూడా...

Published : Oct 08, 2018, 06:03 PM IST
ఆంధ్రా యువకుడిపై కేటీఆర్ ప్రశంసలు...రీట్వీట్ కూడా...

సారాంశం

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ టెక్నాలజీ, సామాజిక మాధ్యామాలను ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఆయన ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. దీంతో చాలా మంది తమ సమస్యలను ఆయనకు ట్విట్ ల ద్వారానే తెలియజేస్తున్నారు. వీటికి కేటీఆర్ స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా #askktr పేరిట ట్విట్టర్ లైవ్ నిర్వహించిన ఆయన ప్రజల సమస్యలపై స్వయంగా స్పందించారు.   

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ టెక్నాలజీ, సామాజిక మాధ్యామాలను ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఆయన ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. దీంతో చాలా మంది తమ సమస్యలను ఆయనకు ట్విట్ ల ద్వారానే తెలియజేస్తున్నారు. వీటికి కేటీఆర్ స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా #askktr పేరిట ట్విట్టర్ లైవ్ నిర్వహించిన ఆయన ప్రజల సమస్యలపై స్వయంగా స్పందించారు. 

ఇప్పటివరకు ప్రజా సమస్యలపై వాడిన సోషల్ మీడియాను కేటీఆర్ ఇప్పుడు పార్టీ విజయం కోసం వాడుతున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ విజయం కోసం విజయవాడ నుండి హైదరాబాద్ కు పాదయాత్ర చేపట్టిన ఓ యువకుడిని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. అతడికి మన మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఏపికి చెందిన రోహిత్ రెడ్డి అనే యువకుడు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కు మద్దతుగా విజయవాడ నుండి  హైదరాబాద్ కు పాదయాత్ర చేపట్టాడు. ఈ వార్త సోషల్ మీడియాతో పాటు పలు చానళ్లలో కూడా ప్రసారమైంది. అయితే శ్రీనివాస్ అనే వ్యక్తి రోహిత్ చేస్తున్న పాదయాత్ర గురించి వివరిస్తూ ఓ వీడియోను జతచేసి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు కేటీఆర్ రీట్వీట్ చేశారు. 

 
'' టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కు మద్దతుగా పాదయాత్ర చేస్తూ తన ప్రేమను, అప్యాయతను వ్యక్తపర్చిన రోహిత్ కు ధన్యవాదాలు''అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.  

 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu