కేటీఆర్‌ను కలిసేందుకొచ్చిన చెన్నమనేని వర్గీయులు.. అపాయింట్‌మెంట్ ఇవ్వని మంత్రి

By Siva KodatiFirst Published Aug 18, 2023, 8:13 PM IST
Highlights

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు వచ్చారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు వర్గీయులు. అయితే వారిని కలిసేందుకు మంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఎమ్మెల్యే రమేశ్ బాబుకే టికెట్ ఇవ్వాలని కోరేందుకే వారు వచ్చినట్లుగా సమాచారం. 

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు వచ్చారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు వర్గీయులు. అయితే కేటీఆర్ కలిసేందుకు సమయం ఇవ్వలేదు. మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే రమేశ్ బాబుకే టికెట్ ఇవ్వాలని కోరేందుకే వారు వచ్చినట్లుగా సమాచారం. వేములవాడ బీఆర్ఎస్‌లో గత కొంతకాలంగా వర్గీ విభేదాలు వున్నాయి. ఇప్పటికే వేములవాడ టికెట్ ఆశిస్తున్నారు చల్మెడ లక్ష్మీనరసింహారావు . ఈ వ్యవహారం పార్టీలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!