గాలిలో ఉన్న కరోనాను అంతం చేసే పరికరం.. ఆవిష్కరించిన ఈటల

Published : Jul 25, 2020, 10:05 AM ISTUpdated : Jul 25, 2020, 10:07 AM IST
గాలిలో ఉన్న కరోనాను అంతం చేసే పరికరం.. ఆవిష్కరించిన ఈటల

సారాంశం

ఈ పరికరానికి సంబంధించి ఉర్జా క్లీన్‌ టెక్‌ సంస్థ దేశవ్యాప్తంగా సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ సేవలు అందిస్తోంది. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మధుసూదనరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ విష్ణు భరద్వాజ్‌లు మంత్రికి ఈ పరికరం గురించి వివరించారు. 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ నేపథ్యంలోనే తయారుచేసిన వైరస్‌ కిల్లర్‌ అనే పరికరాన్ని శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆవిష్కరించారు.

 ప్రపంచాన్ని సార్స్, ఎబోలా పట్టి పీడిస్తున్న తరుణంలో వాటిని అంతం చేయడానికి దక్షిణ కొరియా ఈ పరికరాన్ని రూపొందించింది. ఇది గాలిలో ఉన్న వైరస్‌ను తనలోకి లాక్కొని వాటిని అంతం చేయడం ద్వారా దానిని నిర్మూలిస్తుంది. 

ఇప్పుడు ఈ పరికరానికి సంబంధించి ఉర్జా క్లీన్‌ టెక్‌ సంస్థ దేశవ్యాప్తంగా సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ సేవలు అందిస్తోంది. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మధుసూదనరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ విష్ణు భరద్వాజ్‌లు మంత్రికి ఈ పరికరం గురించి వివరించారు. 

పరికరం ఉన్న పరిసరాల్లో ఉన్నవారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవని తెలిపారు. సెమినార్‌ హాళ్లు, తరగతి గదుల వంటి వాటిలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఆస్పత్రులు, షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లలో ఈ పరికరాలు చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం