ఏపీకి వస్తున్నా....చంద్రబాబూ! కాస్కో!!: అసదుద్దీన్ ఓవైసీ

By Nagaraju penumalaFirst Published Mar 2, 2019, 3:26 PM IST
Highlights

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, అటు ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తమ టార్గెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 35 పార్లమెంట్ సీట్లు గెలుపొందడమేనన్నారు. చంద్రుడు వస్తున్నా కాస్కో అంటూ అసదుద్దీన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేశారు.
 

హైదరాబాద్: త్వరలోనే ఏపీలో పర్యటించనున్నట్లు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఏపీకి వస్తున్నా చంద్రబాబు నాయుడు కాస్కో అంటూ హెచ్చరించారు. 

తాను ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తానని వైసీపీ గెలుపుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, అటు ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తమ టార్గెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 35 పార్లమెంట్ సీట్లు గెలుపొందడమేనన్నారు. చంద్రుడు వస్తున్నా కాస్కో అంటూ అసదుద్దీన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ తో పొత్త పెట్టుకున్నప్పుడు అనేకమంది విమర్శించారని తెలిపారు. బీజేపీతో టీఆర్ఎస్ కలిసిపోతుందని వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ముస్లిం పార్టీగా తమకు తెలుసునని చెప్పుకొచ్చారు. 

గతంలో అసదుద్దీన్ ఓవైసీ ఏపీలో అడుగుపెడతానని చంద్రుడు వస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. తన మిత్రుడు వైఎస్ జగన్ కు మద్దతుగా ఏపీలో ప్రచారం చేస్తానని కూడా చెప్పారు. ఇకపోతే ఏపీలో అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేస్తే నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలలోని ముస్లిం మైనార్టీ ఓటర్లను ప్రభావితం చెయ్యగలరని ప్రచారం జరుగుతోంది. 

ఇదిగనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బేనని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏపీలోని కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించి ఎంఐఎం పార్టీ జెండా ఎగురవేసింది.   

click me!