ఇంటర్ పరీక్ష రాస్తూ.. విద్యార్థి మృతి

By ramya NFirst Published Mar 2, 2019, 1:55 PM IST
Highlights

నాలుగు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే.

నాలుగు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. కాగా... ఓ ఇంటర్ విద్యార్థి పరీక్ష రాస్తూ.. ఎగ్జామ్ హాల్ లోనే కన్నుమూశాడు. ఈ విషాద సంఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది.

శనివారం ఇంటర్‌ పరీక్ష రాస్తూ గోపిరాజ్‌ అనే విద్యార్థి మృతి చెందాడు. ప్యారడైజ్‌ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఈ విషాదం నెలకొంది. విద్యార్థి గోపిరాజ్‌ పరీక్ష రాస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది హుటాహుటిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. 

అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అయితే.. విద్యార్థి ఎలా మృతిచెందాడు అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!