మెడికో ప్రీతి ఘటనపై విచారణ: ఎంజీఎం సూపరింటెండ్ డాక్టర్ చంద్రశేఖర్

Published : Feb 22, 2023, 02:33 PM IST
మెడికో  ప్రీతి ఘటనపై విచారణ: ఎంజీఎం  సూపరింటెండ్ డాక్టర్ చంద్రశేఖర్

సారాంశం

మెడికో  ప్రీతి  ఆత్మహత్యాయత్నం చేసుకుందా లేదా  అనే  విషయమై    అంతర్గతంగా  విచారణ చేస్తున్నామని ఎంజీఎం  సూపరింటెండ్  డాక్టర్  చంద్రశేఖర్ చెప్పారు.  

వరంగల్: మెడికో  ప్రీతి  ఘటనపై విచారణకు  కమిటీని  ఏర్పాటు  చేసినట్టుగా  ఎంజీఎం  ఆసుపత్రి సూపరింటెండ్  డాక్టర్  చంద్రశేఖర్ చెప్పారు. బుధవారం నాడు  వరంగల్ లో  ఆయన మీడియాతో మాట్లాడారు.  మెడికో  ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసుకుందా , ఇతరత్రా  కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం తేలాల్సి ఉందన్నారు.  ఈ విషయమై  విచారణ చేస్తున్నామన్నారు.  ప్రీతి హనికరమైన ఇంజక్షన్ తీసుకున్నట్టుగా  తమకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. ప్రీతితో పాటు  విధులు నిర్వహించిన  మరో ఇద్దరిని కూడా ఈ విషయమై  విచారించినట్టుగా  డాక్టర్  చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు.

 ప్రీతి  ఏదైనా  ఇంజక్షన్ తీసుకుంటే  ఆ ఇంజక్షన్ కు విరుగుడు ఇవ్వడానికి  ఈ సమాచారం తెలుసుకున్నామని  ఆయన వివరించారు.   మూడు మాసాల క్రితం  ప్రీతి తమ కాలేజీలో  చేరిందన్నారు. మూడు మాసాల నుండి  వేధింపులు జరుగుతున్నాయా లేదా అనే విషయం విచారణలో తేలనుందన్నారు.  ఇంతకాలం నుండి  ప్రీతి వేధింపులను భరిస్తుందా , ఇటీవల కాలంలోనే  వేధింపులు ప్రారంభమయ్యాయా అనే విషయమై  విచారణ కమిటీ తేల్చనుందని  సూపరింటెండ్  తెలిపారు.

also read:వరంగల్ కేఎంసీలో మెడికో ఆత్మహత్యాయత్నం: వేధింపులే కారణమంటున్న తండ్రి

 ఈ విషయం తమ దృష్టికి రావడంతో   సీనియర్ విద్యార్ధిని  వేరే విభాగంలోకి  మార్చినట్టుగా  సూపరింటెండ్  తెలిపారు.  ప్రీతిపై  సీనియర్  ర్యాగింగ్ కు పాల్పడితే   చట్టప్రకారం  శిక్షిస్తామని  సూపరింటెండ్  తెలిపారు.  ఈ విషయమై  పోలీసులకు  కూడా  తాము ఫిర్యాదు  చేసినట్టుగా  సూపరింటెండ్  తెలిపారు. పోలీసుల విచారణకు  తాము పూర్తిగా సహకరిస్తామన్నారు.మరో వైపు పోలీసుల విచారణతో పాటు  అంతర్గతంగా  ఫ్రొఫెసర్ల కమిటీ   నివేదిక ఆధారంగా  చర్యలు తీసుకుంటామని  డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే