ముగ్గురు విద్యార్థుల మృతి: వేములవాడలో వాగేశ్వరీ స్కూల్ సీజ్

Published : Aug 29, 2019, 01:30 PM ISTUpdated : Aug 29, 2019, 01:33 PM IST
ముగ్గురు విద్యార్థుల మృతి: వేములవాడలో వాగేశ్వరీ స్కూల్ సీజ్

సారాంశం

వేములవాడలో ముగ్గురు విద్యార్ధులు మృతి చెందిన తర్వాత విద్యాశాఖాధికారులు కళ్లు తెరిచారు. వాగేశ్వరీ స్కూల్ ను  విద్యాశాఖాధికారులు సీజ్ చేశారు. 

వేములవాడ: వేములవాడలోని వాగేశ్వరీ స్కూల్ ను గురువారం నాడు విద్యాశాఖాధికారులు సీజ్ చేశారు. ఈ స్కూల్ కు చెందిన  విద్యార్థులు బుధవారం నాడు జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు మృతి చెందిన విషయం తెలిసిందే.

నిబంధనలకు విరుద్దంగా ఈ స్కూల్ ను నిర్వహిస్తున్నట్టుగా విద్యాశాఖాధికారులు గుర్తించారు. ఈ స్కూల్ కు అనుబంధంగా హాస్టల్‌ను కూడ నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ స్థానిక రాజకీయ పార్టీకి చెందిన నేతగా గుర్తించారు.

వాగేశ్వరీ స్కూల్ తో పాటు  వేములవాడలోని ఇతర స్కూళ్లకు గుర్తింపు ఉందా లేదా అనే విషయమై అధికారులు పరిశీలిస్తున్నారు.  ఈ స్కూల్‌కు షిఫ్టింగ్ పర్మిషన్ లేదు. ఈ విషయమై నాలుగు దఫాలు నోటీసులు జారీ చేసినట్టుగా ఎంఈఓ సురేష్ కుమార్ తెలిపారు.

పదవ తరగతి వరకు ఈ స్కూల్ కు అనుమతి ఉందని సురేష్ కుమార్ తెలిపారు. అయితే  ఈ స్కూల్ షిఫ్టింగ్ కోసం అనుమతి  ఇవ్వలేదన్నారు. ఈ  విషయమై డీఈఓ ఆదేశాల మేరకు స్కూల్ ను సీజ్ చేసినట్టుగా  సురేష్ కుమార్ తెలిపారు.  ఈ స్కూల్ వాణిజ్య సముదాయంలో ఉంది. ఈ స్కూల్ ను మార్చాలని నోటీసులు జారీ చేసిన విషయాన్ని విద్యాశాఖాధికారులు గుర్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వేములవాడలో స్కూల్ వ్యాన్‌ బోల్తా, ముగ్గురు చిన్నారుల దుర్మరణం
 

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu