వేములవాడలో ముగ్గురు విద్యార్ధులు మృతి చెందిన తర్వాత విద్యాశాఖాధికారులు కళ్లు తెరిచారు. వాగేశ్వరీ స్కూల్ ను విద్యాశాఖాధికారులు సీజ్ చేశారు.
వేములవాడ: వేములవాడలోని వాగేశ్వరీ స్కూల్ ను గురువారం నాడు విద్యాశాఖాధికారులు సీజ్ చేశారు. ఈ స్కూల్ కు చెందిన విద్యార్థులు బుధవారం నాడు జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు మృతి చెందిన విషయం తెలిసిందే.
నిబంధనలకు విరుద్దంగా ఈ స్కూల్ ను నిర్వహిస్తున్నట్టుగా విద్యాశాఖాధికారులు గుర్తించారు. ఈ స్కూల్ కు అనుబంధంగా హాస్టల్ను కూడ నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ స్థానిక రాజకీయ పార్టీకి చెందిన నేతగా గుర్తించారు.
వాగేశ్వరీ స్కూల్ తో పాటు వేములవాడలోని ఇతర స్కూళ్లకు గుర్తింపు ఉందా లేదా అనే విషయమై అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ స్కూల్కు షిఫ్టింగ్ పర్మిషన్ లేదు. ఈ విషయమై నాలుగు దఫాలు నోటీసులు జారీ చేసినట్టుగా ఎంఈఓ సురేష్ కుమార్ తెలిపారు.
పదవ తరగతి వరకు ఈ స్కూల్ కు అనుమతి ఉందని సురేష్ కుమార్ తెలిపారు. అయితే ఈ స్కూల్ షిఫ్టింగ్ కోసం అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ విషయమై డీఈఓ ఆదేశాల మేరకు స్కూల్ ను సీజ్ చేసినట్టుగా సురేష్ కుమార్ తెలిపారు. ఈ స్కూల్ వాణిజ్య సముదాయంలో ఉంది. ఈ స్కూల్ ను మార్చాలని నోటీసులు జారీ చేసిన విషయాన్ని విద్యాశాఖాధికారులు గుర్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
వేములవాడలో స్కూల్ వ్యాన్ బోల్తా, ముగ్గురు చిన్నారుల దుర్మరణం