హైదరాబాద్లో మతాంతర వివాహం చేసుకున్న ఓ వివాహిత కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. బేగంబజార్కు చెందిన రాజు-నాజ్నీన్ అనే యువతి యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు
హైదరాబాద్లో మతాంతర వివాహం చేసుకున్న ఓ వివాహిత కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. బేగంబజార్కు చెందిన రాజు-నాజ్నీన్ అనే యువతి యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్యసమాజ్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
నాజ్నీన్ హిందూ మతాన్ని స్వీకరించి.. తన పేరును పూజగా మార్చుకుంది. అయితే ఈ నెల 17న అమ్మాయి కనిపించకుండా పోయింది. తన భార్యను ఆమె కుటుంబసభ్యులు కిడ్నాప్ చేశారని.. ప్రస్తుతం తన భార్య 4 నెలల గర్భవతని ఆమెకు అబార్షన్ చేయిస్తానని తండ్రి బెదిరిస్తున్నాడని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. పరువు కోసం తన భార్యను చంపుతారని... ఆమెను తనకు అప్పగించాలని రాజు మీడియా ద్వారా తెలిపాడు.