ములుగు ఏజెన్సీలో మావోయిస్టుల ఘాతుకం.. ఇన్ ఫార్మర్ నెపంతో వ్యక్తి హత్య.. టీఆర్ఎస్ కి షాకింగ్ లేఖ...

By SumaBala BukkaFirst Published Nov 10, 2022, 9:26 AM IST
Highlights

ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ వ్యక్తిని అతి దారుణంగా చంపేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఎన్ కౌంటర్లు పెరిగాయని లేఖలో పేర్కొన్నారు. 

ములుగు : ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వెంకటాపురం మండలంలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కొండాపురం గ్రామానికి చెందిన సబక గోపాల్ ను దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలోనే ఇన్ఫార్మర్ గా వ్యవహరించే వారు పద్ధతి మార్చుకోకుంటే ప్రజా కోర్టు శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. ఈ మేరకు వాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. వివరాల ప్రకారం..  బుధవారం రాత్రి గోపాల్ ఇంట్లో ఉన్న సమయంలో ఐదుగురు అనుమానితులు రావడంతో వారిని గమనించిన గోపాల్ బయటకి పరిగెత్తగా, వెంబడించి పట్టుకున్నారు. 

గ్రామ సమీపంలోకి తీసుకువెళ్లి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి, గొడ్డలితో నరికి చంపేశారు. రక్తపుమడుగులో పడివున్న గోపాల్ మృతి చెందినట్లు నిర్ధారించుకుని లాల్ సలామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా, మృతుడికి ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. పోలీస్ ఇన్ ఫార్మర్ గా వ్యవహరించడంతోనే గోపాల్ ను హత్య చేసినట్లు వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. 

కేసీఆర్ కు దమ్ముంటే ఆ పని చేయాలి.. తరుణ్ చుగ్ సవాల్...

మరోవైపు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్కౌంటర్ల పేరుతో చాలామందిని కాల్చి చంపారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగానే ఇన్ ఫార్మర్ గా వ్యవహరించే వారు పద్ధతి మార్చుకోకుంటే ప్రజా కోర్టు శిక్ష తప్పదని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. 20 రోజుల క్రితం మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి,  తెలంగాణ సరిహద్దుల్లో పర్యటించి పోలీసులను అప్రమత్తం చేశారు. అయినప్పటికీ ఇలా హత్య జరగడం ఏజెన్సీలో కలకలం సృష్టించింది.

click me!