"టీఆర్ఎస్ పార్టీ - కెసిఆర్" డాక్యుమెంటరీ సీడీని ఆవిష్కరించిన కవిత

Published : Nov 19, 2018, 07:01 PM ISTUpdated : Nov 19, 2018, 07:05 PM IST
"టీఆర్ఎస్ పార్టీ - కెసిఆర్" డాక్యుమెంటరీ సీడీని ఆవిష్కరించిన కవిత

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ఈ పార్టీ ప్రచారం కోసం ఇంగ్లాండ్ నుండి టీఆర్ఎస్ యూకే బృందం రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నారై బృందం పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుండి కేసీఆర్ ప్రస్థానం ఎలా సాగిందన్న దానిపై ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ముఖ్యంగా కెసిఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమ మరియు అభివృద్ధి గురించి రూపొందించిన ఈ డాక్యుమెంటరీ సీడీని నిజామాబాద్ ఎంపీ కవిత ఆవిష్కరించారు.   

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ఈ పార్టీ ప్రచారం కోసం ఇంగ్లాండ్ నుండి టీఆర్ఎస్ యూకే బృందం రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నారై బృందం పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుండి కేసీఆర్ ప్రస్థానం ఎలా సాగిందన్న దానిపై ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ముఖ్యంగా కెసిఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమ మరియు అభివృద్ధి గురించి రూపొందించిన ఈ డాక్యుమెంటరీ సీడీని నిజామాబాద్ ఎంపీ కవిత ఆవిష్కరించారు. 

ఇవాళ ఎన్నారై బృందం కవితతో సమావేశమై ఎన్నికల ప్రచారం గురించి చర్చించారు. రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో తాము నిర్వహించబోయే ప్రచారాన్ని గురించి వారు ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా కవిత వారికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సెల్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం,యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చంద్రశేఖర్ గౌడ్, నాయకులు మల్లేష్ పప్పుల పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bandi Bhagirath Controversy: బండి భగీరథ్ పై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ | Asianet News Telugu
KTR Fires on Bandi Sanjay: బండి సంజయ్ పై కేటీఆర్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu