లోన్ యాప్‌ల కేసులో మరొకరు అరెస్ట్: ఇప్పటివరకు రూ. 300 కోట్లు సీజ్

Published : Mar 11, 2021, 04:45 PM IST
లోన్ యాప్‌ల కేసులో మరొకరు అరెస్ట్: ఇప్పటివరకు రూ. 300 కోట్లు సీజ్

సారాంశం

లోన్ యాప్‌ల కేసులో మరొకరిని హైద్రాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఏపీ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్:లోన్ యాప్‌ల కేసులో మరొకరిని హైద్రాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఏపీ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.రాజశేఖర్ బెంగుళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు.  9 మంది లోన్ యాప్ లకు అతను డైరెక్టర్ గా ఉన్నాడు. 

ఇన్‌స్టంట్ లోన్ లు ఇచ్చే లోన్ యాప్ లు.. లోన్లు తీసుకొన్నవారిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ వేధింపులు బరించలేక తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ కేసులో ఇప్పటివరకు 26 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 300 కోట్లను సీజ్ చేశారు.

లోన్ యాప్ ల నుండి రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించని వారిని యాప్ నిర్వాహకులు తీవ్రంగా ఇబ్బందుుల పెట్టేవారు. ఈ వేధింపులు భరించలేక పలువురు పోలీసులను ఆశ్రయించారు. మరికొందరు ాత్మహత్యలు చేసుకొన్నారు.

దీంతో ఈ యాప్ నిర్వాహకులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే చైనాకు చెందిన కొందరు డైరెక్టర్లుగా సంస్థలు నడుపుతున్నట్టుగా తేలింది. 

 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu