ఎల్బీనగర్- అమీర్‌పేట మెట్రో‌ను ప్రారంభించిన గవర్నర్

Published : Sep 24, 2018, 12:25 PM ISTUpdated : Sep 24, 2018, 12:51 PM IST
ఎల్బీనగర్- అమీర్‌పేట మెట్రో‌ను  ప్రారంభించిన గవర్నర్

సారాంశం

ఎల్బీనగర్-అమీర్‌పేట మెట్రో రైలు మార్గాన్ని  సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ నరసింహాన్  ప్రారంభించారు.


హైదరాబాద్: ఎల్బీనగర్-అమీర్‌పేట మెట్రో రైలు మార్గాన్ని  సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ నరసింహాన్  ప్రారంభించారు. సుమారు 16 కి.మీ. దూరంలోని ఈ మార్గాన్ని కనీసం 50 నిమిషాల్లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే  నాగోల్ నుండి మియాపూర్‌ వరకు  మెట్రో రైలు మార్గం పూర్తైంది. రెండో మార్గంగా ఎల్బీనగర్ -అమీర్‌పేట వరకు మెట్రో రైలు‌ను గవర్నర్ ప్రారంభించారు. 
 అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ మార్గంలో మెట్రోని సోమవారం అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్‌  నరసింహన్‌  ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ప్రయాణికులను అనుమతించనున్నారు.

అమీర్‌పేట నుండి ఎల్బీనగర్ కు  సుమారు 16కి.మీ. ఈ 16 కి.మీల దూరాన్ని కేవలం 50 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చు. బస్సుల్లో అయితే సుమారు గంటన్నరకుపైగా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అయితే  ఇక నరకమే.

ఈ మార్గంలో సుమారు 17 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అయితే నాలుగు రైల్వేస్టేషన్లో మాత్రమే పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌‌‌గా ఏంజీబీఎస్‌ పేరోందింది.  ఎంజీబీఎస్ కూడ ఈ మార్గంలోనే ఉంది.

రైల్వేస్టేషన్లలో బ్యాటరీ సైకిళ్లను ప్రయాణీకులకు అందుబాటులో ఉంచారు.ఎల్బీనగర్-అమీర్‌పేట మార్గంలో ప్రతి రోజూ సుమారు 30వేల మంది ప్రయాణిస్తారని అంచనా. ఈ మార్గంలో 8 నిమిషాలకు ఒక మెట్రో నడపనున్నారు.

రద్దీ వేళల్లో ఆరున్నర నిమిషాలకు ఒకటి నడుపుతారు.మెట్రో కారిడార్-1, మెట్రో కారిడార్-2లను కలుపుకొని ఇప్పటికి 46 కి.మీ రైలు మార్గం పొడవు 46 కి.మీ. చేరింది.ఢిల్లీ మెట్రో రైలు మార్గం తర్వాత హైద్రాబాద్ మెట్రో రైలు మార్గం అతి పెద్దదిగా పేరొందింది.కారిడార్‌-2లోని నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు 30 కి.మీ. మార్గాన్ని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ గత ఏడాది నవంబరు 28న ప్రారంభించారు.


 

 

PREV
click me!

Recommended Stories

దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu
Rapido: ర్యాపిడో ఉప‌యోగించే మ‌హిళ‌ల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. అందుబాటులోకి కొత్త స‌ర్వీస్‌