హిమాచల్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు: ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ ను అప్రమత్తం చేసిన కేటీఆర్

Published : Jul 11, 2023, 11:23 AM ISTUpdated : Jul 11, 2023, 03:21 PM IST
హిమాచల్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు: ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ ను అప్రమత్తం చేసిన కేటీఆర్

సారాంశం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చిక్కుకున్న  తెలుగు విద్యార్థులను రక్షించేందుకు  అవసరమైన చర్యలు తీసుకోవాలని  మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 

హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో  కొందరు తెలుగు విద్యార్ధులు చిక్కుకున్నారనే విషయమై అందిన సమాచారం మేరకు ఢిల్లీలోని  రెసిడెంట్  కమిషనర్ ను అప్రమత్తం చేసినట్టుగా  తెలంగాణ మంత్రి కేటీఆర్  పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు, మనాలిలో  కొందరు విద్యార్ధులు  చిక్కుకుపోవడంపై పేరేంట్స్ ఆందోళన చెందుతున్నారు.  ఈ విషయమై  కేటీఆర్ కు  కొందరు విద్యార్థుల పేరేంట్స్  సమాచారం ఇచ్చారు. తమ పిల్లలను  సురక్షితంగా తెలంగాణకు  రప్పించేందుకు  చర్యలు తీసుకోవాలని వారు  కోరారు.  ఈ విషయమై  తెలంగాణ మంత్రి కేటీఆర్ న్యూఢిల్లీలోని రెసిడెంట్  కమిషనర్ ను అప్రమత్తం  చేశారు.  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చిక్కుకున్న  తెలుగు విద్యార్థులను స్వరాష్ట్రానికి రప్పించేందుకు  చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.ఈ విషయంలో ఏమైనా సహాయం అవసరమైతే  తమను సంప్రదించాలని  మంత్రి కోరారు.

హిమాచల్ ప్రదేశ్ లో వరదల్లో చిక్కుకున్న  వారి కోసం  న్యూడిల్లీ తెలంగాణ భవన్ లో  హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది  తెలంగాణ ప్రభుత్వం. సహాయం కోసం  9643723157, 9871999044 ఫోన్ చేయవచ్చని  ప్రభుత్వం తెలిపింది.  మరో వైపు  rctelangana@gmail.com లో ఫిర్యాదు చేయవచ్చని  తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
 

 

 

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు  నమోదు కాని భారీ వర్షపాతం హిమాచల్ రాష్ట్రంలో నమోదైంది. దీంతో  పెద్ద పెద్ద భవనాలు కూడ  పేకమేడలా కుప్పకూలిపోతున్నాయి.  బ్రిడ్జిలు  వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా  కొండ చరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్ సీఎంతో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న  ఫోన్ లో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా  నెలకొన్న పరిస్థితులపై  మోడీ ఆరా తీశారు.  కేంద్రం నుండి అవసరమైన సహాయాన్ని అందిస్తామని  కూడ మోడీ హామీ ఇచ్చారు.  భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలలో  పెద్ద ఎత్తున ఆస్తి,  ప్రాణ నష్టం సంభవించింది.

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!