హైద్రాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ మీటింగ్: నీటి కేటాయింపులు సహా కీలకాంశాలపై చర్చ

Published : May 10, 2023, 04:26 PM IST
హైద్రాబాద్  జలసౌధలో  కేఆర్ఎంబీ  మీటింగ్: నీటి కేటాయింపులు సహా కీలకాంశాలపై  చర్చ

సారాంశం

కేఆర్ఎంబీ  సమావేశం  ఇవాళ  జలసౌధలో  ప్రారంభమైంది. 


హైదరాబాద్: కేఆర్ఎంబీ  సమావేశం  బుధవారం నాడు  హైద్రాబాద్ జలసౌధలో ప్రారంభమైంది.  రెండు  రాష్ట్రాల మధ్య  నీటి  కేటాయింపులు , ఇతర విషయాలపై ఈ సమావేశంలో   చర్చించనున్నారు  రెండు  రాష్ట్రాల అధికారులు.  

గత  ఏడాది నుండి  కృష్ణా నదిలో  ఉమ్మడి  ఏపీ రాష్ట్రానికి  కేటాయించిన   నీటిలో  సగం సగం  చొప్పున  కేటాయించాలని  తెలంగాణ డిమాండ్  చేస్తుంది.  అయితే  తెలంగాణ వాదనపై ఏపీ రాష్ట్రం అభ్యంతరం చెబుతుంది. జూన్ నుండి  కొత్త  నీటి సంవత్సరం ప్రారంభం కానుంది.  దీంతో   కృష్ణా నది జలాల్లో  తమకు  కూడ సగం కేటాయించాలని  ఈ సమావేశంలో తెలంగాణ డిమాండ్  ను విన్పించనుంది.  కృష్ణా బోర్డుకు  బడ్జెట్  కేటాయింపులపై కూడా  చర్చ జరగనుంది. రెండు  రాష్ట్రాలు  బోర్డు  నిర్వహణకు  నిధులు కేటాయించాలి.  
మరో వైపు ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకొనే  విషయమై  చర్చించనున్నారు.  రెండు  రాష్ట్రాలు  పరస్పరం  కొన్ని  ప్రాజెక్టులపై  ఫిర్యాదు  చేసుకున్నాయి. ఈ విషయమై  కూడా  చర్చించే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: కేసీఆర్ కాళేశ్వరం కట్టింది అందుకే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు పడి పడి నవ్విన అధికారులు, రైతులు | Telangana Rythu Bharosa