పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: కృష్ణా రివర్ బోర్డు భేటీ

Published : May 13, 2020, 02:24 PM ISTUpdated : May 13, 2020, 02:31 PM IST
పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: కృష్ణా రివర్ బోర్డు భేటీ

సారాంశం

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం బుధవారం నాడు ప్రారంభమైంది. వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే.  

హైదరాబాద్:కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం బుధవారం నాడు ప్రారంభమైంది. వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే.

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం 203 జీవోను  ఈ నెల 5వ తేదీన జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచితే తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతంలోని నల్గొండ, మహాబూబ్ నగర్ జిల్లాలు ఏడారిగా మారే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.

also read:88వేల క్యూసెక్కులు తరలించే ప్లాన్: పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్

కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో కృష్ణా నది మిగులు జలాల పంపకంపై చర్చ జరగనుంది. కృష్ణా బేసీన్ ఉన్న ప్రాంతాలకు నీటి పంపిణీకి సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అంతేకాదు గతంలో పెండింగ్ లో ఉన్న సమస్యలపై కూడ సమావేశంలో చర్చించనున్నారు.

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచితే తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా నష్టపోనుందో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు వాదించనున్నారు. మరో వైపు వరద నీటినే తాము ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం కూడ ఈ సమావేశంలో వాదనను విన్పించనుంది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న కృష్ణా రివర్ బోర్డు ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఈ సమావేశం తర్వాత తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కృష్ణా బోర్డు సెక్రటరీని కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది.
 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu