తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి సంచలనం

Published : Mar 12, 2018, 11:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి సంచలనం

సారాంశం

తన చేతిలో ఉన్న హెడ్ సెట్ విసిరిన కోమటిరెడ్డి గవర్నర్ ప్రసంగంలో షాకింగ్ ఘటన హెడ్ ఫోన్ తగిలి శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కు గాయాలు స్వామిగౌడ్ ను సరోజిని కంటి దవాఖానకు తరలింపు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే హాట్ హాట్ గా మొదలయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం రణరంగంగా మారింది. గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలి నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చింపి సభలో విసిరేశారు.

అయితే తొలిరోజు అసెంబ్లీలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనం సృష్టించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వద్ద ఉన్న హెడ్ సెట్ గవర్నర్ వైపు విసిరికొట్టారు. ఈ ఘటనతో సభలో వాతావరణం మరింత వేడెక్కింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్ గవర్నర్ కు తగలలేదు. కానీ.. పక్కనే ఉన్న శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తలకు తలిగింది. దీంతో ఆయనకు గాయమైంది. ఆయనను వెంటనే సరోజిని కంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇదిలా ఉండగా తన చర్యను ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్థించుకున్నారు. వెల్ లోకి వెళ్లకుండా అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. నిరసన తెలిపడం ప్రజాస్వామ్యంలో హక్కు అని స్పష్టం చేశారు. తన చర్యలో ఏమాత్రం తప్పులేదన్నారు. రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సభలో నిరసన తెలిపింది. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఇక గవర్నర్ ప్రసంగాన్ని తెలంగాణ బిజెపి బహిష్కరించింది.

PREV
click me!

Recommended Stories

Union Minister Rammohan Naidu Inaugurates ‘Wings India 2026’ in Hyderabad | Asianet News Telugu
Civil Aviation Minister Rammohan Naidu Speech at Wings India 2026 Hyderabad | Asianet News Telugu