మేడ్చల్‌లో ఒకడిపై నలుగురి దాడి...కత్తితో నలుగురిని ఎదుర్కొన్న యువకుడు

By sivanagaprasad kodatiFirst Published Oct 22, 2018, 8:05 AM IST
Highlights

ఒకడిని చేసి నలుగురు మీద పడటంతో.. ఆ యువకుడు ప్రాణరక్షణ కోసం కత్తితో నలుగురిపై ఎదురుదాడికి దిగి ఒకరిని చంపాడు. మేడ్చల్ జిల్లా యాప్రాల్‌లో ఒక విషయమై ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది

ఒకడిని చేసి నలుగురు మీద పడటంతో.. ఆ యువకుడు ప్రాణరక్షణ కోసం కత్తితో నలుగురిపై ఎదురుదాడికి దిగి ఒకరిని చంపాడు. మేడ్చల్ జిల్లా యాప్రాల్‌లో ఒక విషయమై ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.. చివరికి అది ఘర్షణకు దారి తీసింది.

దీంతో నలుగురు యువకులు.. శ్రావణ్ అనే వ్యక్తిపై దాడికి దిగారు.. ప్రాణాలు కాపాడుకునేందుకు సదరు యువకుడు కత్తితో వారిపై ఎదురుదాడికి దిగాడు. ఈ ఘటనలో విక్కీ అనే యువకుడు మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివాహేతర సంబంధమే ఘర్షణకు కారణమని సమాచారం. మరిన్ని వివరాలు అందాల్సి వుంది.

click me!