అది మా పార్టీ ఎన్నికల స్ట్రాటజీ.. అభ్యర్థుల ఎంపిక 50 శాతం పూర్తి: కిషన్ రెడ్డి

Published : Oct 09, 2023, 10:59 AM IST
అది మా పార్టీ ఎన్నికల స్ట్రాటజీ.. అభ్యర్థుల ఎంపిక 50 శాతం పూర్తి: కిషన్ రెడ్డి

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల ఎంపిక 50 శాతం పూర్తి చేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల ఎంపిక 50 శాతం పూర్తి చేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్దంగా ఉందని అన్నారు. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం తమ ఎన్నికల స్ట్రాటజీ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు కొత్త రైల్వే టెర్మినల్ వస్తోందని అన్నారు. జనవరిలో చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను జాతికి అంకితం చేయనున్నట్టుగా చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్‌లో కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగిస్తామని చెప్పారు. 

ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ కోసం రైల్వే బోర్డు నిధులు మంజూరు చేసిందని.. రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటే త్వరగా పనులు పూర్తిచేస్తామని అన్నారు. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్‌కు భూమిపూజ చేసుకున్నామని తెలిపారు. ఆర్ఎంయూ నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమవుతాయని చెప్పారు. 


సిద్దిపేటలో రాష్ట్ర మంత్రులు రైల్వే అధికారులను తిడుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. రైల్వే పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైల్వే అధికారులను తిడితే ఊరుకోమని  అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu