పెరుగుతున్న‌ కాంగ్రెస్ గ్రాఫ్.. ఆందోళ‌న‌లో బీఆర్ఎస్-బీజేపీ... : మాణిక్ రావు ఠాక్రే

Published : Jun 07, 2023, 05:41 PM IST
పెరుగుతున్న‌ కాంగ్రెస్ గ్రాఫ్.. ఆందోళ‌న‌లో బీఆర్ఎస్-బీజేపీ... : మాణిక్ రావు ఠాక్రే

సారాంశం

Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎక్కడా కనిపించడం లేదనీ, కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో ప్రజాదరణ వేగంగా పడిపోవడంతో ఆ పార్టీకి ఆందోళనలు పెరిగాయని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. అలాగే, రాష్ట్రంలో బీజేపీ దిగజారుతోందనీ, ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని అన్నారు.   

Telangana AICC incharge Manikrao Thakare: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎక్కడా కనిపించడం లేదనీ, కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో ప్రజాదరణ వేగంగా పడిపోవడంతో ఆ పార్టీకి ఆందోళనలు పెరిగాయని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. అలాగే, రాష్ట్రంలో బీజేపీ దిగజారుతోందనీ, ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని అన్నారు. ది హిందూ ఆయ‌న మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుండి చాలా మంది నాయకులు కాంగ్రెస్ లో చేర‌డానికి ఆసక్తిగా ఉన్నారు. రాష్ట్రంలో మ‌రింత‌గా కాంగ్రెస్ బ‌ల‌ప‌డ‌టం, ప్ర‌జాద‌ర‌ణ‌ను పొంద‌డంతో బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది:  ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎక్కడా కనిపించడం లేదనీ, కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో ప్రజాదరణ వేగంగా పడిపోవడంతో ఆ పార్టీకి ఆందోళనలు పెరిగాయని అన్నారు. మరోవైపు, తమపై పెరుగుతున్న వ్యతిరేకతతో బీఆర్ఎస్ ఆందోళన చెందుతోందనీ, ముఖ్యంగా రైతులు, యువకులు తమ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహంతో ఉన్నారని మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. అయితే, కాంగ్రెస్ అందరికీ తలుపులు తెరవదనీ, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని చేర్చుకునేటప్పుడు దీర్ఘకాలిక కాంగ్రెస్ నాయకులు, నిబద్ధత కలిగిన క్యాడర్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలు, నియోజకవర్గాల్లోని సీనియర్ నేతల అభిప్రాయాలు తెలుసుకుని వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

తెలంగాణ‌లో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందనీ, కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటోందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కూడా గ్రహించారనీ, ఇటీవల ఆ పార్టీ ట్రాక్ మార్చడం కేసీఆర్ భయాన్ని సూచిస్తోందని ఆయన అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసే ఉన్నాయని తాము చెబుతున్నది నిజమేనని ఆయన నిరూపిస్తున్నారనీ, ఆయన తాజా వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటూ ఆరోపించారు. బీజేపీపై కేసీఆర్ మౌనం గమనించదగినదనీ, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీని ప్రొజెక్ట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా బీజేపీ అదృష్టాన్ని పెంచలేమని గ్రహించి కాంగ్రెస్ పై ఆయన పదునైన దాడిని పెంచారని ఠాక్రే పేర్కొన్నారు. అలాగే,  మీడియాలో ఆకర్షణీయమైన పతాక శీర్షికల కోసం పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్ పాత ఎత్తుగడలను ప్రయోగిస్తోందని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ ను తరిమికొట్టాలని నిర్ణయించడంతో ఆయనకు పెద్దగా ఒరిగేదేమీ లేదన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలపై  మాట్లాడుతూ.. మీడియా ఊహించినట్లుగా, ప్రొజెక్ట్ చేయనట్లుగా ఉంద‌నీ, చాలా మంది అదుపులోనే ఉన్నార‌నీ, అంతర్గ‌త గొడ‌వ‌లు త‌గ్గాయ‌ని తెలిపారు. సీనియర్ నేతలంతా కలిసికట్టుగా, తమదైన శైలిలో పనిచేస్తున్నార‌ని వెల్ల‌డించారు. టికెట్ల ప్రకటనపై ఆయన మాట్లాడుతూ.. సరైన సమయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనీ, అయితే స్థానిక నాయకత్వం నుంచి వస్తున్న డిమాండ్ తో ఈ అంశానికి కొంత ప్రాముఖ్యత ఉందన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

BRS Boycotts Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎదుట బిఆర్ఎస్ నాయకుల నిరసన| Asianet News Telugu
Kavitha Pressmeet: నా రక్తం ఉడుకుతోంది KCRపై CMరేవంత్ వ్యాఖ్యలను ఖండించిన కవిత | Asianet News Telugu