టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు .. త్వరలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్న సిట్, రమేశ్ అరెస్ట్‌తో కొత్త విషయాలు

By Siva KodatiFirst Published Jun 7, 2023, 5:23 PM IST
Highlights

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు త్వరలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు . ఇటీవల అరెస్ట్ అయిన రమేశ్‌పైనా సిట్ అధికారులు మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు త్వరలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. మొత్తం 37 మందిని నిందితులుగా పేర్కొనగా.. ప్రవీణ్, రాజశేఖర్‌లను ప్రధాన సూత్రధారులుగా ప్రస్తావించింది. మొత్తం 6 పేపర్లు లీక్ అవ్వగా.. అభ్యర్ధుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఇటీవల అరెస్ట్ అయిన రమేశ్‌పైనా సిట్ అధికారులు మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. 

మరోవైపు.. టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసులో అరెస్టైన  డీఈ రమేష్ ను   కస్టడీకి  ఇవ్వాలని  సిట్ గత  శుక్రవారం  పిటిషన్ దాఖలు  చేసింది. ఆరు  రోజుల పాటు  కస్టడీకి  ఇవ్వాలని సిట్  కోర్టును కోరింది. డీఈ రమేష్‌కు  ఎవరెవరు  సహకరించారనే  విషయమై  సిట్  దర్యాప్తు  చేస్తుంది. రెండు  పరీక్ష పేపర్ల మాల్ ప్రాక్టీస్ ద్వారా  రూ. 10  కోట్లు వసూలు  చేయాలని రమేష్  ప్లాన్  చేసుకున్నాడు. అయితే  పేపర్ లీక్ అంశం  బయటకు పొక్కింది.   పోలీసులు విచారణ   ప్రారంభించడంతో  డీఈ కి ఆశించిన  స్థాయిలో  డబ్బులు అందలేదని  సిట్ గుర్తించిందని సమాచారం.

ALso Read: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. పిల్లల కోసం పేపర్ కొనుగోలు చేసిన కొందరు ప్రజాప్రతినిధులు..!!

డీఏవో, ఏఈఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను విక్రయించిన విద్యుత్ శాఖ డివిజినల్ ఇంజనీర్(డీఈ) రమేష్.. 80 మందికి పేపర్‌ అమ్మినట్టుగా గుర్తించారు. ఇందుకుగానూ ఒక్కొక్కరినుంచి రూ. 30 లక్షల బేరం కుదుర్చుకున్నాడు. పూల సురేష్ నుంచి ఏఈఈ పేపర్ ని రమేష్ తీసుకున్నాడని.. అయితే పూల రమేష్‌కు కీలక నిందితుడు ప్రవీణ్ పేపర్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్, సురేష్, రమేష్‌లు ఓకే దగ్గర నివాసం ఉండటంతో వీరిమధ్య పరిచయం అయినట్లు సిట్ అధికారులు నిర్దారణకు వచ్చారు. 

వరంగల్ విద్యుత్ శాఖ డీఈగా ఉన్న రమేష్.. తాను పనిచేస్తున్న ఏరియా  పరిధిలో పేపర్లు అమ్మాడు. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోని చాలామంది అభ్యర్థులకు ఏఈఈ పేపర్ ను అమ్మినట్లు విచారణలో గుర్తించారు. ఈ జాబితాలో పలువురు ప్రజాప్రతినిధుల పిల్లలకు కూడా ఉన్నారు. ప్రజాప్రతినిధులు తమ పిల్లల కోసం ఏఈఈ పరీక్షా పేపర్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. కరీంనగర్ జిల్లాలకు  చెందిన ఓ మాజీ ఎంపీటీసీ కూడా తన కూతురు కోసం రమేష్ వద్ద నుంచి పేపర్ కొనుగోలు చేసినట్టుగా సమాచారం. ఇక, పరీక్షకు ముందు వారిద్దరు ఒకసారి కలిశారని.. అతడి కూతురికి రమేష్ ఎలక్ట్రిక్ డివైజ్ ఇచ్చాడు. ఇక, డీఈ రమేష్.. పేపర్ ఇచ్చేందుకు గాను ఒక్కొక్కరి దగ్గర నుంచి 30 లక్షల రూపాయలకు బేరం కుదర్చుకున్నట్లు తెలిసింది. 
 

click me!