ఉత్తమ్, జానా కు కెసిఆర్ ప్రేమ గులాబీలు

Published : Jun 20, 2017, 07:08 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ఉత్తమ్, జానా కు కెసిఆర్ ప్రేమ గులాబీలు

సారాంశం

ఆయనకు వారిద్దరూ బద్ధ శత్రువులే. పొద్దున లేస్తే వారిద్దరూ ఆయనను విమర్శిస్తూనే ఉంటారు. పదునైన పదజాలంతో ఆయనపై వారిద్దరూ విరుచుకుపడుతుంటారు. ఆయన కూడా వారిపై ఒంటికాలిమీద లేస్తూ మాటల దాడి చేసేవారే. కానీ వారిద్దరికీ ఆయన ప్రేమ గులాబీలు పంపిర్రు. వారిద్దరు ఎవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి. మరి ప్రేమ గులాబీలు పంపినవారు ఎవరో తెలుసా?

ఈనెల 20వ తేదీన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరి జన్మదినోత్సవం ఉంది. ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్నతమైన హోదాలో ఉన్నవారే కావడంతో తెలంగాణ సిఎం కెసిఆర్ వారిద్దరి ఇళ్లకు తెలంగాణ సిఎం కెసిఆర్ పూల బొకేలు పంపించారు. 

 

దీంతోపాటు వారిద్దరికీ ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలతోపాటు ప్రత్యేక జన్మదిన సందేశాలు కూడా రాసి పంపారు. ప్రజలకు మరింత సేవ చేసేలా భగవంతుడు వారిని ఆశీర్వదించాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షల సందేశం అందుకున్న జానారెడ్డి సిఎం కేసీఆర్ కు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు.

 

మొత్తానికి రాజకీయాలు రాజకీయాలే మానవ సంబంధాలు మానవ సంబంధాలే అని రుజువు చేశారు మన ముగ్గురు నేతలు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech |అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Revanth Reddy vs KCR
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu