ఏపీ సీఎం జగన్ స్కీమ్‌పై కేసీఆర్ ప్రశంసలు.. ఇంతకీ ఏమన్నారంటే..

Published : Oct 15, 2023, 04:43 PM IST
ఏపీ సీఎం జగన్ స్కీమ్‌పై కేసీఆర్ ప్రశంసలు.. ఇంతకీ ఏమన్నారంటే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ అమలు తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ అమలు తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ మేనిఫెస్టోను కేసీఆర్ ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ  ప్రజలపై పలు హామీల వర్షం కురిపించారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. ఆసరా పెన్షన్లను ఐదేండ్లలో 5 వేల రూపాయలకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ఆసరా పెన్షన్లు రూ. 2,016 అందిస్తున్నట్టుగా చెప్పారు. 

అయితే వచ్చే ఏడాది మార్చి తర్వాత ఆసరా పెన్షన్‌ను రూ. 3 వేలకు పెంచి.. ప్రతి ఏడాది 500 రూపాయలు పెంచుతూ.. ఐదో సంవత్సరం వరకు రూ. 5 వేలకు చేరుకుంటుందని అన్నారు. తద్వారా ప్రభుత్వంపై ఒకేసాని భారం పడే అవకాశం ఉండదని అన్నారు. ఏపీలో కూడా ఇదే విధంగా అక్కడి ముఖ్యమంత్రి విజయవంతం చేశారని ప్రస్తావించారు. 

సీఎం జగన్.. సక్సెస్‌ఫుల్‌గా ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నారని చెప్పారు. రూ. 2 వేలతో ప్రారంభించారని.. ఇప్పుడు దానిని రూ. 3 వేలకు తీసుకొచ్చారని అన్నారు. చాలా విజయవంతంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగిందని చెప్పారు.  అదే పద్దతిలో తెలంగాణలో కూడా తాము రూ. 3 వేలు తక్షణమే చేస్తామని.. క్రమంగా ప్రతి సంవత్సరం రూ. 500 పెంచుతూ ఐదో ఏడాదికి రూ. 5 వేలకు చేరేలా చేస్తామని చెప్పారు. తద్వారా ప్రభుత్వంపై ఒకేసారి భారం పడే అవకాశం ఉండదని అన్నారు.  

అలాగే.. దివ్యాంగులకు పెన్షన్‌ను ఇటీవల రూ. 4 వేలకు పెంచామని.. దానిని రూ. 6 వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. వచ్చే మార్చి తర్వాత రూ. 5 వేలకు పెంచి.. ఆ తర్వాత పెంచుకుంటూ పోతామని చెప్పారు. ప్రతి ఏడాది రూ. 300 పెంచుకుంటూ.. ఆరు వేల రూపాయలకు తీసుకెళ్తామని తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...
CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu