దేవరయంజాల్ భూముల కుంభకోణంలో ఏసీబీ, విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.
హైదరాబాద్: దేవరయంజాల్ భూముల కుంభకోణంలో ఏసీబీ, విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దేవరయంజాల్ గ్రామంలోని శ్రీసీతారామస్వామి దేవాలయానికి చెందిన భూములను మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహా ఇతరులు ఆక్రమించారనే విషయమై ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాదు ఈ విషయమై సోమవారం నాడు ఏసీబీ, విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
also read:దేవరయంజాల్లో కేటీఆర్, మల్లారెడ్డికి భూములు: సీబీఐ విచారణకు రేవంత్ డిమాండ్
ఈ గ్రామానికి సోమవారం నాడు ఏసీబీ, విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించేందుకు వెళ్లారు. ఈ భూములు ప్రస్తుతం కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. అక్రమణదారులు కమర్షియల్ గోడౌన్లను నిర్మించుకొన్నారు. ఈ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు కూడ లేవని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై నిజానిజాలను తేల్చనున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు.మాజీ మంత్రి ఈటల రాజేందర్ మెదక్ జిల్లాలోని మాసాయిపేట, హకీంపేటల్లో సుమారు 600 ఎకరాలను ఆక్రమించారని ఆ జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.