దేవరయంజాల్ భూములు: ఏసీబీ, విజిలెన్స్ విచారణకు కేసీఆర్ ఆదేశం

Published : May 03, 2021, 06:31 PM IST
దేవరయంజాల్ భూములు: ఏసీబీ, విజిలెన్స్ విచారణకు కేసీఆర్ ఆదేశం

సారాంశం

దేవరయంజాల్ భూముల కుంభకోణంలో ఏసీబీ, విజిలెన్స్ విచారణకు  తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. 

హైదరాబాద్: దేవరయంజాల్ భూముల కుంభకోణంలో ఏసీబీ, విజిలెన్స్ విచారణకు  తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దేవరయంజాల్ గ్రామంలోని శ్రీసీతారామస్వామి దేవాలయానికి చెందిన భూములను మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహా ఇతరులు ఆక్రమించారనే విషయమై ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాదు  ఈ విషయమై  సోమవారం నాడు ఏసీబీ, విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 

also read:దేవరయంజాల్‌లో కేటీఆర్‌, మల్లారెడ్డికి భూములు: సీబీఐ విచారణకు రేవంత్ డిమాండ్

ఈ గ్రామానికి సోమవారం నాడు ఏసీబీ, విజిలెన్స్ అధికారులు  విచారణ నిర్వహించేందుకు వెళ్లారు.  ఈ భూములు ప్రస్తుతం కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. అక్రమణదారులు కమర్షియల్ గోడౌన్లను నిర్మించుకొన్నారు. ఈ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు కూడ లేవని  ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై నిజానిజాలను తేల్చనున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు.మాజీ మంత్రి ఈటల రాజేందర్ మెదక్ జిల్లాలోని  మాసాయిపేట, హకీంపేటల్లో సుమారు 600 ఎకరాలను ఆక్రమించారని ఆ జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.