
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో గ్రామ కంఠాల స్థలాల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే జీహెచ్ఎంసీలో నోటరీ రిజిస్ట్రేషన్లకు కూడా అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేల భేటీలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించి జీవో త్వరలో విడుదల కానుంది.