కేసీఆర్ బాషపై తెలంగాణ ప్రజల ఆగ్రహం

First Published Aug 4, 2017, 1:57 PM IST
Highlights
  • కేసీఆర్ ఫ్లెక్సీలను తగలబెడుతు నిరసన తెలిపిన తెలంగాణ ప్రజలు
  • దుర్భాషలాడటం మానాలని హితవు

 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయిని దిగజార్చుకునేలా మాట్లాడుతున్నారని ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు. తెలంగాణని ఒక బూతులు మాట్లాడే రాష్ట్రం గా మారుస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు  నిరసనగా ఆయన  ఫ్లెక్సీలు, కటౌట్లు  తగలబెడుతున్నారు ప్రజలు. ప్రెస్ ముందు ఇతర పార్టీ నాయకులను దుర్బాషలాడుతున్నాడే తప్ప, ప్రజా సమస్యలపై మాట్లాడిన సంధర్బం ఒక్కటీ లేదని  ఆవేదన చెందారు. ప్రత్యర్థి పార్టీలను నీచంగా మాట్లాడటం సరికాదన్నారు. 
సీఎం ఇకనైనా రాజకీయాల విమర్శలను తగ్గించి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. మీడియా ముందు హుందాగా మట్లాడి ప్రజల్లో తనకున్న గౌరవాన్ని కాపాడుకోవాలంటున్నారు. 
 

click me!