కౌశిక్ రెడ్డిపై ఆరోపణలు.. వేదికపైనే ఏడ్చేసిన కరీంనగర్ జడ్పీ ఛైర్మన్

By Siva KodatiFirst Published Nov 18, 2022, 4:50 PM IST
Highlights

కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో  మీటింగ్ స్టేజ్‌పైనే జడ్పీ ఛైర్మన్ కనిమెళ్ల విజయ కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.

కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కలకలం రేగింది. మీటింగ్ స్టేజ్‌పైనే జడ్పీ ఛైర్మన్ కనిమెళ్ల విజయ కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి స్టేజ్ మీదకు రాగానే ఏడుస్తూ మంత్రి గంగులకు బాధను తెలిపారు విజయ. జమ్మికుంటలో దళిత బంధు పథకానికి ఇచ్చిన భూమి విషయంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. విజయ కంటతడి పెట్టడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. 

click me!