కౌశిక్ రెడ్డిపై ఆరోపణలు.. వేదికపైనే ఏడ్చేసిన కరీంనగర్ జడ్పీ ఛైర్మన్

Siva Kodati |  
Published : Nov 18, 2022, 04:50 PM IST
కౌశిక్ రెడ్డిపై ఆరోపణలు.. వేదికపైనే ఏడ్చేసిన కరీంనగర్ జడ్పీ ఛైర్మన్

సారాంశం

కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో  మీటింగ్ స్టేజ్‌పైనే జడ్పీ ఛైర్మన్ కనిమెళ్ల విజయ కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.

కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కలకలం రేగింది. మీటింగ్ స్టేజ్‌పైనే జడ్పీ ఛైర్మన్ కనిమెళ్ల విజయ కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి స్టేజ్ మీదకు రాగానే ఏడుస్తూ మంత్రి గంగులకు బాధను తెలిపారు విజయ. జమ్మికుంటలో దళిత బంధు పథకానికి ఇచ్చిన భూమి విషయంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. విజయ కంటతడి పెట్టడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?