వరంగల్ చేరుకున్న జేపీ నడ్డా.. భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజలు..

Published : Aug 27, 2022, 03:50 PM ISTUpdated : Aug 27, 2022, 03:54 PM IST
వరంగల్ చేరుకున్న జేపీ నడ్డా.. భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజలు..

సారాంశం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌‌లో వరంగల్‌ చేరుకున్న జేపీ నడ్డాకు పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌‌లో వరంగల్‌ చేరుకున్న జేపీ నడ్డాకు పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. జేపీ నడ్డా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం జేపీ నడ్డా రోడ్డు మార్గంలో భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించికున్నారు. జేపీ నడ్డాతో పాటు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.  అనంతరం తెలంగాణ ఉద్యమకారుడు రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట నారాయణ నివాసానికి జేపీ నడ్డా వెళ్లనున్నారు.  అనంతరం ఆర్ట్స్ కాలేజ్ వద్దకు చేరుకుంటారు. బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొంటారు. 

దాదాపు గంటకు పైగా జేపీ నడ్డా బీజేపీ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు బయలుదేరుతారు. అనంతరం నోవాటెల్‌ హోటల్‌లో హీరో నితిన్‌తో సమావేశం కానున్నారు. అలాగే మరికొందరు సినీ ప్రముఖులు, కవులు, రచయితలతో జేపీ నడ్డా సమావేశమవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర శనివారం మధ్యాహ్నం ముగిసింది.  వరంగల్ భద్రకాళి ఆలయం వరకు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర చివరి రోజు బండి సంజయ్ 14 కి.మీ నడిచారు. 

ఇదిలా ఉంటే.. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో  జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జేపీ నడ్డాతో పాటు ఆయన సతీమణి కూడా హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌లతో పాటు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌ చేరుకుని.. భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ పాల్గొన్నారు. 

ఈ సమావేశం అనంతరం తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయలుదేరివెళ్లారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్