మహంకాళీ బోనాలలో జోగిని శ్యామల కంటతడి.. కేసీఆర్ ప్రభుత్వానికి శాపనార్థాలు(వీడియో)

Published : Jul 29, 2018, 05:55 PM ISTUpdated : Jul 30, 2018, 12:16 PM IST
మహంకాళీ బోనాలలో జోగిని శ్యామల కంటతడి.. కేసీఆర్ ప్రభుత్వానికి శాపనార్థాలు(వీడియో)

సారాంశం

తెలంగాణ ప్రభుత్వంపై జోగిని శ్యామల మండిపడ్డారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే భక్తుల తాకిడికి సరిపడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వంపై జోగిని శ్యామల మండిపడ్డారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే భక్తుల తాకిడికి సరిపడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు..

పోలీసులు వీఐపీల సేవలో తరిస్తున్నారని.. బోనం ఎత్తుకుని వెళ్లేవారికి కేటాయించిన క్యూలైన్లో సాధారణ భక్తులను పంపుతున్నారని.. ఒక్కొక్కరు 10 కిలోల బరువును తలపై పెట్టుకుని నిల్చున్నారని.. గొప్పగా ఏర్పాట్లు చేశామని చెబుతున్న ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదని ఆమె కంటతడి పెట్టారు. ఈ ప్రభుత్వం కచ్చితంగా పడిపోతుందని ఆమె శ్యామల చెప్పారు.

"

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఒకేసారి ఎండలు, వానలు
Pawan Kalyan మీద దేశద్రోహం కేసు పెట్టాలి: Kalvakuntla Kavitha | Asianet News Telugu